ఇంటర్నెట్ శోధన దిగ్గజం గూగుల్ తన మ్యాప్ యాప్కు ''గ్రూప్ ప్లానింగ్'' పేరిట కొత్త ఫీచర్ను జోడించింది. స్నేహితులతో కలసి విందు వినోదాలు చేసుకునేవారికి ఇదొక అనువైన ఫీచర్. తమ మిత్రులకు వివిధ రెస్టారెంట్లను సూచిస్తూ లింక్ షేర్ చేసేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది. అదెలాగో తెలుసుకుందాం...
1. గూగుల్ మ్యాప్స్ను ఓపెన్ చేయండి.
2. EXPLORE TAB లో రెస్టారెంట్లను ఎంపిక చేసుకుని వాటిపై ట్యాప్ చేయండి.
3. ఏదైనా లొకేషన్ మీద లాంగ్ ప్రెస్ చేయండి.
4. స్క్రీన్పై కుడివైపు దిగువన కనిపించపే బబుల్లో లింక్ను డ్రాప్ చేయండి.
5. అలా అన్ని ప్రదేశాలనూ ఎంపిక చేసుకున్న అనంతరం వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ లేదా గూగుల్ హాంగవుట్స్ వంటి సోషల్ మెసేజింగ్ యాప్ద్వారా వాటిని షేర్ చేసుకోండి.
మీరు ఎంపిక చేసిన రెస్టారెంట్లు, ప్రదేశాలను ఈ షేర్డ్ లింక్ మీ మిత్రులకు చూపుతుంది. దీని ఆధారంగా అందరూ లైక్, డిజ్లైక్ పద్ధతిలో ఓట్ చేసి, ఒక రెస్టారెంట్ను ఎంపిక చేసుకుని విందు-వినోదాలతో ఎంజాయ చేయొచ్చు. ఇక ఎంపిక చేసిన, ప్రదేశాలను డిలీట్ చేసే లేదా అదనంగా జోడించే ఆప్షన్ గ్రూప్లోని ప్రతి సభ్యుడికీ ఉండాలి. గ్రూప్లోని సభ్యులందరూ షేర్ చేసుకున్న లింక్ ద్వారా గూగుల్ మ్యాప్స్ యాప్ వారిని రీడైరెక్ట్ చేస్తుంది. సభ్యులలో ఎవరికైనా మ్యాప్స్ యాప్ లేనప్పటికీ వారు ఆ లింక్ను వెబ్లో చూసుకోవచ్చు. గ్రూప్ ప్లానింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్లలో ఈ వారంలోనే ప్రారంభమవుతుందని, మ్యాప్స్ యాప్ లేనివారు యాప్ ఉన్నవారు అప్డేల్ చేసుకోవాలని గూగుల్ ఒక బ్లాగ్ స్పాట్లో ప్రకటించింది.
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగల్ ఇటీవలే ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. స్మార్ట్ఫోన్ వినియోగదారులు తమ లొకేషన్తోపాటు ఫోన్ బ్యాటరీ స్థాయిని కూడా షేర్ చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. అయితే, ఇది చాలా కాలం నుంచే అందుబాటులో ఉన్నా అందరి దృష్టికీ రాలేదని Android Police పేర్కొంటోంది. గూగుల్ మ్యాప్స్లోని లొకేషన్ షేరింగ్ ఫీచర్కు అనుగుణంగా ఈ కొత్త ఫీచర్ పని చేస్తుందని తెలిపింది.
Authorization