ఇటీవలే చైనాలో విరుదల చేసిన రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియాలో కూడ విడుదలకానున్నట్లు సమాచారం. ఈ టీజర్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఓ కొత్త ఒరవడిని రేకెత్తిస్తున్నాయి. ఇందుకు కారణం ఇది అందించిన 48MP కెమేరా. అయితే ఇప్పుడు ఈ కెమెరాకి సంభంధించిన మరొక కొత్త ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే రానున్న ఒక సాఫ్ట్ వేర్ అప్డేట్ ద్వారా 'సూపర్ నైట్ సీన్ కెమేరా మోడ్' అందుకోనుంది.
డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్తో ఈ రెడ్మి నోట్ 7, 2340 x1080 పిక్సెళ్ళు గల 6.3 అంగుళాల LCD ప్యానెల్ తోవస్తుంది. 450 nits బ్రైట్నెస్తో కేవలం 0.8mm మందపాటి bezels ను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది. అలాగే బ్యాక్ -మౌంటు ఫింగర్ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660SoC కి జతగా 3GB, 4GB, 6GB RAM వేరియంట్లలో 32GB, 64GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.
పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా 5 MP సెకండరీ సెన్సారుతో కలిపి 48MP సెన్సారు కలిగిన మొదటి Redmi ఫోన్ ఇది. ఈ నోట్ 7 48MP సెన్సార్ తక్కువ కాంతిలో కూడా మంచి షాట్లు తీసుకోవచ్చని కంపెనీ చెబుతుంది. ఈ 48 MP కెమెరా సెన్సార్ 1/2 అంగుళ పరిమాణాన్ని కలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుంది. ఇందులో అతితక్కువ 0.8 um అంగుళాల పిక్సెళ్ళు నిజంగా బాగుంటుంది. కెమెరా సెన్సార్లో 48 మెగాపిక్సెళ్లను క్రామ్ చేయగలిగింది. Xiaomi ప్రకారం, Redmi Note 7 పోస్టర్ వంటి HD ఫొటోలను తీయగలదు. ముందుభాగంలో పోర్త్రైట్ మోడ్, పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా 13MP కెమెరా ఉంటుంది.
Authorization