డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన యాప్లలో ఒకటైన పేటిఎం బ్యాంక్ తాజాగా తన ఖాతాదారుల కోసం మొబైల్ బ్యాంకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని 4.3 కోట్ల మంది ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. 2017లో ప్రారంభమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలకు ఇప్పటి వరకు 4.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ బ్యాంక్ ఇప్పటికే 20 లక్షలకు పైగా డెబిట్ కార్డులను అందించింది. కొత్తగా వచ్చిన యాప్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టడం, వర్చువల్ డెబిట్ కార్డు వంటి సేవలు పొందవచ్చు. దీని వల్ల బ్యాంక్ అకౌంట్ను వేగంగా, సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు, డెబిట్ కార్డు కోసం రిక్వెస్ట్ పంపడం, డిజిటల్ డెబిట్ కార్డు యాక్సెస్ వంటి తదితర సేవలు పొందొచ్చు. ఈ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా ఎప్పుడైనా బ్యాంక్ సహాయాన్ని కోరవచ్చు. దీంతో ప్రస్తుతం పేమెంట్స్కు మాత్రమే ఉపయోగించే ఈ యాప్తో వారంలో ఏడు రోజులూ బ్యాంక్ సేవలు పొందే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లోకి అందుబాటులోకి రాలేదు. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై సంస్థ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Authorization