మన దేశంలో చైనా వస్తువుల వాడకం చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఏ రకం వస్తువైనా సరే మేడ్ ఇన్ చైనా అని అందుబాటులో ఉంటుంది. దీన్ని బట్టే చెప్పవచ్చు ప్రతీ రంగంలోనూ చైనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. అందులోనూ చైనా వస్తువులు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుండడంతో వాటి వాడకానికి డిమాండ్ బాగానే ఉంటోంది. అందులోనూ ఇప్పటికే మొబైళ్ళ తయారీలో చైనా తన హవా చూపించింది. ఈ ధాటికి నోకియా, లావా, మైక్రోమాక్స్ వంటి ఎన్నో కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు మన టీవీ మార్కెట్పై చైనీస్ కంపెనీలు కన్నేశాయి. భారీ డిస్కౌంట్లతో, అద్భుతమైన ఆఫర్లతో స్మార్ట్ టీవీలను సగటు, మధ్యతరగతి వారికి అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. మొబైల్ కంపెనీ అయిన షామీ నుంచి ఎంఐ టీవీ 4 సిరీస్లను అతి తక్కువ ధరలో తీసుకురావడం ఇండియన్ టెలివిజన్ రంగంలో పెను సంచలనం సృష్టించింది. MI LED Tv Pro32 అంగుళాల ప్రారంభ ధర రూ.12,999 నుంచే లభ్యం కావడంతో మిగిలిన కంపెనీలు డీలా పడిపోయాయి. 'జియో' రాకతో మిగిలిన మొబైల్ సేవల కంపెనీలకు నష్టాలు మొదలైనట్టు, ఎంఐ రాకతో ఇన్నాళ్లు భారతదేశంలో ఓ వెలుగు వెలిగిన శాంసంగ్, సోనీ వంటి టెలివిజన్ దిగ్గజాలకు గడ్డు కాలం మొదలవ్వబోతుందని టెక్ నిపుణులు కూడా అంచనాలు వేస్తున్నారు. తాజాగా మరో చైనా టెలివిజన్ తయారీ కంపెనీ షింకో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. అదిరిపోయే ధరల్లోShinco SO4A39 అంగుళాల లెడ్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది.HD టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ నణ రిజల్యూషన్ లెడ్ టీవీ ధర కేవలం రూ.13,990కు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 24 అంగుళాల లెడ్ టీవీ ప్రారంభ ధర కేవలం రూ.6,490 మాత్రమే. 65 అంగుళాల టీవీ ధర రూ.59,990గా ఉంది.
హెచ్డీ రెజల్యూషన్తో పాటు రెండు HMDA పోర్టులు, రెండు USBపోర్టులు ఉండే ఈ టీవీ ఫైల్స్ ట్రాన్స్ఫర్కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.20W స్పీకర్, ఎనర్జీ సేవింగ్ ఫీచర్ కూడా ఈ స్మార్ట్ టీవీలో ఉన్నాయి. 40 అంగుళాల ఫుల్హెచ్డీ స్మార్ట్ లెడ్ టీవీSO42AS-E50 ధర రూ.16,450 మాత్రమే.. టీవీ కొన్న తర్వాత మరమ్మత్తులు వచ్చినా, సర్వీసింగ్లో, ఇన్స్టాలేషన్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా ఫిర్యాదు చేసేందుకు షింకో ఆండ్రాయిడ్ యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్లో ఈ టీవీలు కొనుగోలు చేయవచ్చు.
Authorization