షావోమి రెడ్మి గో స్మార్ట్ఫోన్పై జియో ఏకంగా రూ.2,200 క్యాష్బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ప్రస్తుతం ఈ రెడ్మి గో ఫోన్ ధర రూ.4,499 ఉంది. జియో క్యాష్బ్యాక్ను పరిగణలోకి తీసుకుంటే రూ.2,299కే అందుబాటులోకి వస్తుంది. జియో అందించే క్యాష్ బాక్ పొందాలంటే వినియోగదారులు రూ.198 లేదా రూ.299తో రీచార్జ్ చేసుకుంటేనే వర్తిస్తుంది. రూ.2,200 క్యాష్బ్యాక్ను ఒకే సారి కాకుండా 44 డిస్కౌంట్ కూపన్ల రూపంలో జియో ఖాతాలో జమవుతుంది. ఒక్కో కూపన్ విలువ రూ.50 ఉంటుంది. మై జియో యాప్ ద్వారా రీచార్జ్ చేసుకునే సమయంలో రూ.50 తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ కూపన్లను మార్చి 22 నుంచి 2023 మార్చి 31 వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ క్యాష్బ్యాక్తో పాటు 100 జీబీ డేటాను పొందొచ్చు. అయితే ఒకేసారి రాదు. పది 10 జీబీ కూపన్లు జియో ఖాతాకు జమవుతాయి. రెడ్మి గో స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లు, జియో సబ్స్క్రైబర్లు అయి ఉంటే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.