రైల్వే ప్రయాణికులకు పెద్ద ఊరట లభిస్తోంది. ప్రయాణ సమయాలలో అనుకోని పరిస్థితులలో మనం టికెట్ బుక్ చేసేకున్న స్టేషన్లో అందుబాటులో ఉండమని తెలిస్తే వేరే స్టేషన్ మార్చుకోవడానికి రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు మార్చుకునే వెసులుబాటును ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కొత్త నిబంధన ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం...
- ఇండియన్ రైల్వే బోర్డింగ్ స్టేషన్ మార్పు విషయంలో కొత్త నిబంధనను అమలులోకి తీసుకురానుంది. టికెట్ రిజర్వ్ చేసుకున్న సమయంలో ఎక్కాల్సిన స్టేషన్ నమోదు చేసుకుని, ప్రయాణం చేసే సమయానికి వేరే స్టేషేన్లో అందుబాటులో ఉంటే.. ఆ స్టేషన్ నుంచే బోర్డింగ్ తీసుకునే విధంగా కొంత వెసులుబాటు ఏర్పడనుంది.
- ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో టికెట్ బుక్ చేసుకుంటే సికింద్రాబాద్లో రైలు ఎక్కాలి. చివరి నిమిషంలో మీ ప్రయాణంలో మార్పులు జరిగి నల్లగొండ నుంచి బయలు దేరాల్సి వస్తే బోర్డింగ్ స్టేషన్ను అక్కడి నుంచే మార్చుకోవచ్చు.
- కానీ రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందే మీ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవాలి. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ సాయంత్రం 6 గంటలకు బయలు దేరుతుందంటే... మధ్యాహ్నం 2 గంటల లోపే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాల్సి ఉంటుంది.
- గతంలో ఈ నిబంధన 24 గంటలుగా ఉండేది. అంటే రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే వెసులుబాటు ఉండేది. బోర్డింగ్ స్టేషన్ మార్పు విషయంలో కొత్త నిబంధన మే 1 నుంచి అమలులోకి రానుంది
- ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకుంటే ఈ మార్పు ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉంటుంది. రైల్వే కౌంటర్లో టికెట్ బుక్ చేసుకున్నవారు రైల్వే ఎంక్వైరీ 139 నెంబర్కు కాల్ చేయాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్లు తీసుకున్నవారు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. ఒక ప్రయాణంలో రెండుసార్లు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశముంది.
Authorization