దశాబ్దం క్రితం ఫోన్ సౌకర్యం కావాలనుకునేవారు ఎక్కువ శాతం లాండ్ లైన్ వినియోగించేవారు. కార్యాలయాల్లో సైతం లాండ్ ఫోన్లే వినియోగించేవారు. ప్రస్తుత పరిస్థితి మారింది. అందరూ సెల్ ఫోన్ మెయిన్టైన్ చేయాల్సిందే. స్మార్ట్ఫోన్ లేకుంటే ఏదో వెలితి అన్నట్టు భావిస్తుంటారు. ఇలా రోజురోజుకు మొబైల్ వాడకం పెరుగుతోంది. ఇందుకు తగినట్టుగానే స్మార్ట్ఫోన్లలో రోజుకొక కొత్త ఫీచర్ను తయారు చేస్తూ ఆయా కంపెనీలు మొబైళ్ళను లాంచ్ చేస్తున్నాయి.ఫోన్ల వాడకం పెరిగనట్టుగానే ఒకొకరు కనీసం రెండు నెంబర్లు వాడుతున్నారు. ఈ పెరిగిన వినియోగానికి తగినట్టుగానే సిమ్ కంపెనీలు ఆయా నెట్వర్క్ టవర్లను పెంచుతున్నారు.
గడిచిన దశాబ్దంన్నర కాలంలో టెలికాం రంగం అసాధారణ వృద్ధిని సాధించింది. 2014నాటి లెక్కల ప్రకారం దేశంలో 938 మిలియన్ల వైర్ కనెక్షన్లు, 910 మిలియన్ల వైర్లెస్ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుదయస్కాంత తరంగాలను వాహకాలుగా మార్చుకుంటూ అబ్బురపరిచే ఎలక్ట్రానిక్స్ మాడ్యులేషన్ల పద్దతిలో వివిధ సెల్ఫోన్ కంపెనీలు పని చేస్తున్నాయి. కాల్స్ రద్దీ పెరిగిపోవడంతో సెల్ఫోన్ కంపెనీలు టవర్లను బాగానే విస్తరించాయి. పెరుగుతున్న వాడకానికి తగినట్టుగానే సిగల్స్ అందేలా సెల్ కంపెనీలు టవర్లు ఏర్పాటు చేస్తున్నాయి. పట్టణాలలో అయితే ఇండ్ల మీదనే దర్శనమిస్తున్నాయి. సెల్ఫోన్ వ్యవస్థలో టవర్లు చాలా కీలకమైనవి. సాధారణంగా మొబైల్కు సిగల్ రావాలంటే రేడియేషన్ ద్వారానే రావాలి. సూక్ష్మ తరంగాలను ఉపయోగించి టవర్ల ద్వారా ఒక దాని నుంచి మరొక దానికి అనుసంధానం చేస్తారు. అంటే.. ఇండ్ల మీద ఏర్పాటు చేసే టవర్ల పరిధిలో రేడియేషన్ ప్రభావం ఉంటుందన్న మాటే కదా. టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ఆ పరిసర ప్రాంతాలలో ఉండే వారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు సైతం హెచ్చరికలు జారీ చేశారు. కానీ టవర్ల యాజమాన్యం మాత్రం పరిమిత సంఖ్యలోనే టవర్ల నుంచి రేడియేషన్ వెలువడుతోందని, జనావరణానికి ఎలాంటి హాని జరగదని వెల్లడి చేశాయి. అయినప్పటికీ రేడియేషన్ వల్లనే కొన్ని రకాల పిచుకలు మరుగయ్యాయని నిపుణులు పేర్కొన్నారు. అసలు ఈ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ఎంత పరిధిలో ఉండవచ్చనే దానికి అధికారులు కొన్ని రకాలు లెక్కలు చెబుతున్నారు.
పరిధులు
టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ఆయా టవర్లఎత్తు మీద ఆధారపడి ఉంటుంది. మన దేశంలో జీఎస్ఎం - 1800 MHz వద్ద ట్రాన్స్మిషన్ వపర్ స్థాయి 0.92 వాట్ / m2, జీఎస్ఎం - 900 MHz వద్ద 0.45 వాట్ / m2 పరిధిలో ఉంటుంది. మొబైల్ హ్యాండ్ సెట్ల నుండి EMF రేడియేషన్ పరిమితి : 1.31, మొబైల్ ఫోన్లకు సంబంధించి 1 గ్రాముల మానవ కణజాలానికి SAR విలువ 1.6 గ్రా / కిలోకు సవరించబడింది.
ఎంత వరకు ప్రమాదం
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలిబుచ్చిన సమాచారం ప్రకారం సెల్ఫోన్ టవర్ల వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కానీ అదే పనిగా ఫోన్ మాట్లాడుతుంటే సూక్ష్మ తరంగాలు తల భాగంలో చేరి హాని కలిగిస్తాయి. ఎలక్ట్రానిక్ పరికరం ఏదైనా అదే పనిగా వాడుతుంటే వేడెక్కుతాయి. అందుకు సెల్ఫోన్ మినహాయింపేమీ కాదు. దేశ వ్యాప్తంగా 80కోట్ల సెల్ఫోన్ నెంబర్లు చెలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం 2జీ, 3జీ, 4జీ లు అందుబాటులో ఉన్నాయి.
ఏర్పాటు ఎలా..
సెల్టవర్లు ఏర్పాటు చేయాలంటే మున్సిపాలిటీ, పట్టణాభివద్ధి సంస్థల నుంచి అనుమతి పొందాలి. జీవో నెంబరు 183 ప్రకారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్పోర్టు అథారిటీ నుంచి అనుమతి పొందాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరిగినా తమదే బాధ్యత అంటూ పూచీకత్తు ఇవ్వాలి. నిర్మాణాలు పటిష్టంగా లేని భవనాలపై టన్నుల కొద్దీ బరువుండే సెల్టవర్లు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
సమాచారం కోసం..
మొబైల్ టవర్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ పరిధి ఎంత ఉందని తెలుసుకోవాలనుకుంటే, ధరమ్ సంచార్ వెబ్సైట్ లోకి వెళ్ళి, తెలుసుకోవాలనుకుంటున్న ప్రాంతానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తే, రేడియేషన్కు సంబంధించిన సమాచారం తెలుస్తుంది. ఒక వేళ ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలనుకున్నా, మరేదైనా సందేహం ఉన్నా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే స్థానిక టెలికాం ఎన్ఫోర్స్మెంట్ అండ్ మానిటరింగ్ ఆధ్వర్యంలో టవర్ రేడియేషన్ను పరీక్షిస్తారు. సందేహం ఉందని దరఖాస్తు చేసిన వ్యక్తి మొబైల్ నెంబరుకు సమాచారం అందుతుంది. ఈ పరిమితికి మించి ఉన్నట్లైతే ట్రారులో ఫిర్యాదు చేయవచ్చు.
ఆరోగ్య సమస్యలు
మొబైల్ టవర్ల నుంచి ఉద్ఘారమయ్యే విద్యుదయస్కాంత క్షేత్రం రేడియోధార్మికత వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. జన సాంద్రత కలిగిన ప్రదేశాలలో ఈ టవర్లను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలపై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. జనావాసాల మధ్య 500 మీటర్ల పరిధిలోని వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ మూలంగా శారీరక రుగ్మతలకు గురవుతారని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. పిచుకలు, పక్షులకు కూడా ముప్పు ఏర్పడుతుంది.
రేడియేషన్ వల్ల మానవ శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందని, తలపట్టడం, వాంతులు, డిప్రెషన్, ఇన్ఫెర్టిలిటీ, పెరాలసిస్, బ్రెయిన్ ట్యూమర్, మజిల్ పెయిన్, క్యాన్సర్, హృద్రోగ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Authorization