ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ రూ.599 రీచార్జ్ ప్లాన్ను తీసుకువచ్చింది. ఇది వాలిడిటీ పొడిగింపు ప్లాన్. ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు (6 నెలలు). అపరిమిత ఉచిత కాల్స్ ఈ ప్లాన్ ప్రత్యేకత. వాలిడిటీ పొడిగింపు ప్లాన్ కావడంతో ఇందులో ఎలాంటి డేటా, ఎస్ఎంఎస్ ఫీచర్లు ఉండవు. వాలిడిటీ, కాల్స్ కోరుకునే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. ఈ ప్లాన్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త ప్లాన్కు మారాలనుకునే వారికి, వాలిడిటీ పొడిగింపు కోరుకునేవారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. కంపెనీ ఇటీవలే సవరించిన రూ.666 ప్రిపెయిడ్ ప్లాన్ను కూడా ఆవిష్కరించింది. దీంతో యూజర్లు ఎక్కువ వాలిడిటీ పొందొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ ఇదివరకు 122 రోజులు. ఇప్పుడు ఈ వాలిడిటీ 134 రోజులకు పెరిగింది. ఈ ప్లాన్లో రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 3.7 జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి.