కీ ఇస్తే శబ్దం చేసే బొమ్మలు, కొన్ని పదాలు పలికే బొమ్మలు గురించి విన్నాం.. చెప్పినట్టు వినే బల్బును ఎక్కడైనా చూశామా..? అంటే కచ్చితంగా లేదని చెప్పవచ్చు. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తుల కంపెనీ షియోమి ఈ తాజా ఉత్పత్తిని దేశీ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. షియోమి తాజాగా తీసుకువచ్చిన ఈ ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ బల్బ్... ధర రూ.999గా నిర్ణయించారు. అయితే తొలి 4,000 ఆర్డర్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని, ఆ తర్వాత ఆర్డర్ల నుంచి రూ.1,299కు చేరుకుంటుందని సంస్థ వెల్లడించింది. కాగా... బల్బ్ షిప్మెంట్స్ మే నెల 20 నుండి ప్రారంభంకానున్నాయి. ఇంతకీ ఈ బల్బ్ ప్రత్యేకతలు ఏమిటంటే... ఇది గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాకు బల్బ్ ఆఫ్ చేయమని ఆదేశం ఇస్తే బల్బ్ ఆఫ్ అవుతుంది. వాటితో పాటు దీన్ని ఎంఐ హోమ్ యాప్ సాయంతో కూడా ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. చాలా రంగులలో అందుబాటులో ఉండనుంది. అందులో నుంచి మనకు నచ్చిన రంగు సెట్ చేసుకోవచ్చు. బల్బ్ 11 ఏండ్ల పాటు మన్నుతుందని కంపెనీ వెల్లడించింది.
Authorization