వన్ప్లస్ మొబైల్ సంస్థ మే 14న తన తర్వాతి ఫోన్ వన్ప్లస్ 7 ప్రొ స్మార్ట్ఫోన్లను మన దేశంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మూడు చోట్ల ఫోన్ను ఆవిష్కరించనున్నారు. మన దేశంలో బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ను ఇందుకు వేదికగా చేసుకున్నారు. వన్ప్లస్ స్టోర్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా, రిలయన్స్ సోర్లలో మే 8 నుంచి వన్ప్లస్ 7 ప్రొ ప్రీ-బుకింగ్ మొదలుకానుంది. ప్రీ బుకింగ్ చేసుకునే వారు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ కొనేటప్పుడు ఈ మొత్తాన్ని తగ్గిస్తారు. వన్టైమ్ యాక్సిడెంటల్ స్క్రీన్ రిప్లేస్మెంట్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. వన్టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ ఇన్స్యూరెన్స్ కింద ప్రాసెసింగ్ ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ ఫోన్కు సంబంధించిన అమ్మకాలకు అమెజాన్ బుకింగ్స్ ప్రారంభించింది. ముందుగా బుక్ చేసుకునే వారికి ఫ్రీ బుకింగ్ ఆఫర్లను సైతం అందిస్తోంది. అందులో రూ.1వేయి విలువైన గిఫ్ట్ కూపన్, రూ.15వేల విలువైన స్క్రీన్ రీప్లేస్మెంట్ ప్లాన్ను ఉచితంగా అందివ్వనున్నారు.