దేశ టెలికాం పరిశ్రమ రూపురేఖలను మార్చేసిన జియో.. అత్యధిక 4జీ నెట్వర్క్తో సేవలతో దూసుకుపోతోంది. వీవోవై-ఫై (వాయిస్ ఓవర్ వై-ఫై) సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సేవలు జియో యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానుంది. కేవలం స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా జియో ఫోన్లలోనూ ఈ సేవలు పొందే అవకాశం ఉండొచ్చు. జియో వైఫై సేవలు అందుబాటులోకి వస్తే సెల్యులర్ నెట్వర్క్తో పనిలేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ సేవలు జియో వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. మున్ముందు ఇతర కస్టమర్లకు కూడా వర్తించే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటికే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి సర్కిళ్లలో ఈ సేవలను పరీక్షిస్తోంది. ఇప్పటికే కొందరు వినియోగదారులకు వారి ఐఫోన్లలో జియో వీవోవై-ఫై సింబల్ కనిపిస్తోంది. అయితే ఈ సేవలు ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయనేది కంపెనీ స్పష్టం చేయలేదు. రానున్న నెలల్లోనే ఈ సేవలు పొందే అవకాశం ఉండొచ్చు. జియో వైఫై సేవలు అందుబాటులోకి వస్తే సెల్యులర్ నెట్వర్క్తో పనిలేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. దీంతో గ్రామీణ ప్రాంతాలు, నెట్వర్క్ సరిగాలేని చోట్ల యూజర్లకు ప్రయోజనం కలుగునుంది.
Authorization