5జీ.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఈ సేవలు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా ఆసక్తి నెలకొంది. మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలు ఇప్పటికే 5జీ స్మార్ట్ఫోన్ల తయారీలో నిమగమై ఉన్నాయి. 5జీ స్మార్ట్టీవీలపైనా నిమగమయ్యాయి. తాజాగా 5జీ ల్యాప్టాప్స్పైనా కసరత్తు చేస్తున్నాయి. చైనాకు చెందిన లెనోవో సంస్థ, అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ క్వాల్కామ్ భాగస్వామ్యంలో 5జీ లాప్టాప్లు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రాజెక్ట్ లిమిట్లెస్ పేరుతో ఈ 5జీ ల్యాప్టాప్ పనులు వేగవంతమవుతున్నాయి. ఈ రెండు సంస్థలు 5జీ ల్యాప్టాప్ గురించి తైవాన్లో జరిగిన కంప్యూటెక్స్ సదస్సులో ప్రకటన చేశాయి. దాని ప్రకారం.. స్నాప్డ్రాగన్ 8సీఎక్స్ కంప్యూటర్ ప్లాట్ఫామ్పై ఇవి పనిచేస్తాయి. అంటే ఇవి 5జీతో పాటు 4జీని కూడా సపోర్ట్ చేస్తాయి. అలాగే వీటిల్లో బ్యాటరీ చార్జింగ్ కూడా కొన్ని రోజుల పాటు ఉండనుంది. స్నాప్డ్రాగన్ ఎక్స్55 5జీ మోడెంను అమర్చనున్నారు. దీంతో 2.5 జీబీపీఎస్ స్పీడ్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే సెకన్లో సినిమా డౌన్లోడ్ అవుతుంది. ఇందులో ప్రపంచంలోనే తొలిసారిగా 7ఎన్ఎం ప్రాసెసర్ ఉండబోతోంది. 5జీ ల్యాప్టాప్స్లో స్నాప్డ్రాగన్ ఎక్స్55 5జీ మోడెంను అమర్చనున్నారు. అయితే ఇవి ఎప్పటికి మార్కెట్లోకి వస్తున్నాయో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Authorization