ప్రశ్న : శరవేగంగా పెరుగుతున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో పాటు అంతకన్నా వేగంగా అశాస్త్రీయ పోకడలు పెరుగుతున్నాయి. దీన్నెలా అర్థం చేసుకోవాలి?
- టి.ధనంజయరావు, పిహెచ్డి స్కాలర్, నిట్, వరంగల్
జవాబు : కొన్ని లక్షల కోట్ల కి.మీ. మేర విస్తరించి ఉన్న గెలాక్సీ నుంచి మిల్లిమీటరులో వేలాది వేలాది కోట్ల వంతుకన్నా సూక్ష్మస్థాయిని ఆక్రమించిన ప్రాథమిక కణాల వరకూ పాదార్థిక పరిజ్ఞానం నేడు మానవ సమాజంలో ఉంది. ఈ విశ్వపు పుట్టుక గురించి ఎన్నో వాదోపవాదాలు ఉన్నా ఫలాని వాదం వాస్తవ పరిశీలనకు చేరువగా ఉన్నాయన్న అంచనా శాస్త్ర సమాజంలో నానుతోంది. కాలానికి, స్థలానికి, జీవానికి చాలా గణనీయమైన మోతాదులో అవగాహన కలిగింది. మరింత లోతుల్లోకి తొంగి చూసేలా పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్నాయి. వేసవిలో పని చేయని పబ్లిక్ కుళాయి నుంచి గంటకు ఒక బొట్టులాగా కారే నీటి బొట్టులోని (సుమారు 0.02మి.లీ.) నీటి అణువుల్ని ప్రపంచంలో ఉన్న సుమారు 663 కోట్ల మందికి సరిసమానంగా పంచితే, నీకు, నాకు, ఆయనకు, ఈయనకు, ఆమెకు, ఈమెకు, ట్రంప్కు, మోడీకి, జగన్కు, కెసిఆర్కు, ఇమ్రాన్ఖాన్కు- ఇంకా ప్రంచంలోని పిల్లలు, ప్రజలు, ప్రతిఒక్కరికీ సుమారుగా పదివేల కోట్ల అణువులు లభిస్తాయి. ఒక సాధారణ టీ కప్పులో ఉన్న మొత్తం నీటి అణువులతో ప్రతి ఒక్క దాని మెడపై జెవివి అనే పచ్చబొట్టు పొడిచినట్లు ఊహించండి. ఇక ఆ కప్పులోని నీటిని బంగాళాఖాతంలో పోసెయ్యండి. ఓ సంవత్సరం గడిచాక ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా సరే ఒక కప్పు నీటిని తీసుకొన్నట్లయితే అందులో తప్పకుండా ఐదారు జెవివి పచ్చబొట్టు ఉన్న నీటి అణువులు ఉంటాయి. దీని అర్థం ఏమిటంటే... నీటి అణువు చాలా చిన్నది. అయినా నీటి అణువు వైశాల్యం రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం వైశాల్యం అనుకుంటే అందులో ఉన్న కేంద్రకాలు ఆవరించే వైశాల్యం ఏ నెల్లూరులోనో, ఏ వరంగల్లోనో ఉంటే, ఓ వీధి వైశాల్యానికి మించదు. అయినా అందులోనే సుమారు 180 ప్రాథమిక కణాలు ఉండగా, మిగిలిన రెండు రాష్ట్రాల వైశాల్యం కేవలం 10 ప్రాథమిక కణాలే తిరుగుతున్నాయి. ఇంతటి సూక్ష్మమైన విజ్ఞానం నేడు మానవుడి పాదార్థిక పరిశోధనల్లో బయటపడింది. అయినా శాస్త్రానికి ఏ విధంగాను అతకని మూఢనమ్మకాలు సమాజంలో ప్రజ్వరిల్లుతున్నాయి. అంతేకాదు, అవి సైన్సు సూత్రాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఓవైపు సైన్సు సూత్రాలతో పనిచేసే మొబైల్ ఫోనును వాడుకుంటూ, మరోవైపు అదే మొబైల్ ఫోనులో సైన్సు సూత్రాలను అవమానపరిచే లేదా కించపరిచే అనువర్తనాలు (Applications) కోసం వాడుతున్నారు. చాలా ఆధునికమైన సునిశితమైన పరమాణు స్థాయి విజ్ఞానం వందలాది నోబెల్ బహుమతులకు కాణాచి అయిన ప్రాథమిక కణ పరిజ్ఞానంతో పని చేసే కంప్యూటర్లను వాడుకుంటూ 12వ శతాబ్దంలోనే నిఖార్సుగా సౌరకేంద్రక సిద్ధాంతానికి వ్యతిరేకమైనదిగా తణీకరించబడిన భూకేంద్రక సిద్ధాంత మూసల్లో పని చేసి, జ్యోతిష్య శాస్త్రానికి 'జశీఎజూబ్వతీ Computer Astrology అంటూ ఏదో ఆకర్షణీయమైన పేరు పెట్టి సైన్సును అపహాస్యం చేస్తున్నారు. ఆడవాళ్ల రక్తం వేరు, మగవాళ్ల రక్తం వేరు అంటున్నారు. సహజమైన భూగర్భ పర్వత శ్రేణుల సంధానాల్ని మానవ నిర్మితాలంటున్నారు. మానవ నిర్మితాల్ని సహజం అంటున్నారు. అర్థం పర్థం లేని పూర్వజన్మ సుకతం అంటూ, పాపం, పుణ్యం అంటూ పడికట్టు పదాల్ని ప్రజల మీద రుద్దుతున్నారు. స్త్రీని విలాస వస్తువుగా చిత్రీకరించే మీడియా కథనాలకు ప్రోత్సాహాన్నిస్తున్నారు. జాతిపితను హత్యగావించిన ఓ దుర్మార్గుడ్ని, భారతీయ శిక్షాస్మృతిలో మరణ దండన పొందిన ఖూనీకోరును దేశభక్తుడిగా వక్రభాష్యం చెబుతున్నారు. అలాంటి వక్రీకరణను పైపైన ఖండిస్తూ అంగున చేర్చుకొని ప్రోత్సహిస్తున్నారు. ప్రజల్ని ప్రజా భావాల్ని మతం మత్తులో జోగేలా చేస్తూ టెర్రరిస్టులుగా న్యాయవ్యవస్థ చేతే ముద్ర వేయబడ్డ వారే ప్రజా ప్రతినిధులవుతున్నారు. అభ్యుదయ శక్తుల్ని నాశనం చేస్తేనే ఛాందస శక్తులు బలం పెరిగేది అన్న కుటిల ఎత్తుగడలతో బయట పరస్పర వ్యతిరేక ముఖాల్ని ప్రదర్శించే శక్తులే ఏకమవుతున్నారు. విభిన్న జాతులు, సంస్కృతులు, భావాలు, భాషల, వత్తులలో ఇంపైన ఇంద్రధనుస్సులా ఉంటే భారతదేశ ఆలోచనా సరళిని, తాత్వికతను, పరంపరను ఏకవర్ణ వ్యవస్థగా మార్చే అల్పబుద్ధులు అందలం ఎక్కుతున్నారు. వాస్తవ సామాజిక దుర్భరాలైన నిరుద్యోగ సమస్య, నగదు అలభ్యత, ధరల పెరుగుదల, పెరిగిన ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, అభద్రత, వ్యవసాయదారుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రాకపోవడం, స్త్రీల మీద దాడులు, రైతుల ఆత్మహత్యలు, మహానగరాల మీదుగా సాగిన రైతాంగ ఉద్యమ పాదయాతల్రు ఇలాంటివేవీ ప్రజానీకపు స్పందనను పెంచలేకపోతున్నాయి. అవాస్తవమైన భావవాద భావోద్వేగాలే ప్రజా నిర్ణయాల్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రజల్లో పోలరైజేషన్ పెరుగుతోంది. ఆ పోలరైజేషన్ మంచిచెడులు, సుఖదు:ఖాలు, మోదం ఆవేదనలు, పేద, ధనిక, పీడన, పీడిత, సముచితం అనుచితం వంటి అంశాల పరంగా కాకుండా అశాస్త్రీయమైన మత ఛాందస భావాల పరంగా పోలరైజేషన్ జరుగుతోంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పోలరైజేషన్ వెర్రి భారతదేశ సమగ్రత, మత సామరస్యం, సుహృద్భావం అనే వేలాది సంవత్సరాలుగా పదిలముగా ఉన్న గాజుపలక మీద జరగడం. ఇది దేశ భవితకు అత్యంత హానికరం. మేకను భుజాన వేసుకొని కుక్క అన్న భావనను పెంచే ఒరవడి తానున్నట్లుంది. యాగాలు చేస్తే వర్షాలు వస్తాయని బలముగా నమ్మే ప్రజాభావజాలం పెరుగుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాల అభ్యున్నతికి, అభివృద్ధి కన్నా ప్రజాజీవితాన్ని, వికాసాన్ని ఏమాత్రం పెంచకపోగా తిరోన్ముఖ మార్గంలో సమాజాన్ని నడిపే కుహనా శాస్త్ర రంగాలకు, ఆముష్మిక సంస్థలకు నిధులు పుష్కలంగా దక్కుతాయి. సైన్సు చతికిల పడుతోంది. ఇనుమడించిన ప్రజాందోళనలు, ప్రజాసైన్సు ఉద్యమవ్యాప్తి మాత్రమే ఈ తిరోన్ముఖ వ్యాధికి శాశ్వత విరుగుడు.
Authorization