భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయివేటు టెలికాం రంగాలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఎప్పకప్పుడు కొత్త ప్లాన్లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్లాన్ అభినందన్ 151. ప్లాన్ ధర రూ.151. ఇందులో అపరిమిత కాల్స్ సదుపాయం ఉంది. రోజుకు 1 జీబీ డేటా పొందవచ్చు. 100 ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు. రూ.151 ప్లాన్ కేవలం 90 రోజులు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉండనుంది. ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా సంస్థ ఈ ప్లాన్ లాంచ్ చేసింది.