ఎయిర్టెల్ టెలికాం సంస్థ తన కస్టమర్లకు మరో సదుపాయాన్ని అందిస్తోంది. అదే.. ఉచిత కాలర్ట్యూన్.. మామూలుగా అయితే నెలకు రూ.36 ఎయిర్టెల్ కాలర్ట్యూన్కు వసూలు చేసేవారు. కానీ ఇకపై ఈ సేవలు ఉచితంగానే అందనున్నాయి. ఈ సేవలు వినియోగించుకోవాలనుకునే వారు వింక్ మ్యూజిక్ యాప్ సాయంతో కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించదు. ఇందుకు సబ్స్క్రైబర్లు కనీసం రూ.129 లేదా ఆపై ప్లాన్ను కలిగి ఉండాలి. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పటికే జియో ఈ సేవలను అందిస్తోంది. ఈ జాబితాలో ఎయిర్టెల్ కూడా చేరింది.