అంతరిక్ష పరిశోధనలపై ఏ దేశానికాదేశమే వినూత్నంగా ఆలోచిస్తోంది. ఇస్రో చంద్రయాన్ ప్రయోగం 1 ప్రయోగం తర్వాత చంద్రయాన్ 2కు రంగం సిద్ధం చేసింది. కానీ ఏండ్ల తరబడి ఈ ఉపగ్రహ ప్రయోగానికి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ నెల 15న ప్రయోగానికి సర్వత్రా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ట్రయల్ కూడా విజయవంతమైందని ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ నేపథ్యంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా వినూత్న ప్రయోగానికి తెర తీసింది. అదే 'ఎక్స్ప్లోర్ మూన్ టు మార్స్'. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే తన అధికారిక వెబ్సైట్లో పెట్టింది. దీని అర్థం ముందుగా చందమామపై లోతైన పరిశోధనలు చేసి, కాలనీలు నిర్మించిన తర్వాత మార్స్ గ్రహానికి వెళ్ళడం. అంటే చంద్రునిపైకి మళ్ళీ వ్యోమగాములను పంపించాలని యోచిస్తున్నది.
45 ఏండ్ల తర్వాత సన్నాహాలు
చందమామపై చివరిసారిగా వ్యోమగాములు కాలుపెట్టి 45 ఏండ్లు దాటింది. ఇప్పటివరకు మళ్లీ ఎవరూ అలాంటి సాహసం చేయలేదు. కానీ ప్రస్తుతం చంద్రుని రహస్యాలు తెలుసుకోవాలని చాలా అంతరిక్ష పరిశోధనా సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే చైనా ప్రయోగం చేసింది. ఇస్రో జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా రూ.603 కోట్లతో చంద్రయాన్-2 ప్రయోగం చేయబోతోంది. ఇందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు అనే మూడు ముఖ్య పరికరాలను అంతరిక్షంలోకి పంపనుంది. మొత్తం బరువు 3,447 కిలోలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువే 1,179కిలోలుగా ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం 2019 సెప్టెంబర్ 6 లేదా 7 లలో ల్యాండర్ చంద్రుడిపై దిగుతుంది. అదే బాటలో తాను కూడా అంటూ అమెరికా అడుగులు కదుపుతోంది.
కాలనీ నిర్మాణం
2024లో చందమామపైకి వ్యోమగాముల్ని పంపాలని నాసా నిర్ణయించుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఇస్రో ప్రయోగం చేయబోతున్న దక్షిణ ధ్రువం వైపే, నాసా కూడా ప్రయోగం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు ఓరియన్ స్పేస్క్రాఫ్ట్ని పంపనుంది. చందమామపై చిన్న కాలనీ నిర్మించాక... 2030లో భూమికి అతి దగ్గరగా ఉన్న మార్స్ గ్రహంపైకి వ్యోమ గాముల్ని పంపాలనుకుంటున్నట్టు, ఇందుకోసం ఇప్పటికే స్పేస్షిప్ల తయారీ మొదలుపెట్టినట్లు నాసా అధికారక వెబ్సైట్ సమాచారం. చంద్రయాన్ పై భారత్ పరిశోధనలు చేస్తున్న సమయంలోనే అదే ప్రదేశంలో ప్రయోగం చేయడానికి అమెరికా లాంటి అగ్రరాజ్యం నిర్ణయించడం గమనార్హం.
Authorization