- ప్రతిరోజూ నియమానుసారం వ్యాయామం. ప్రతిరోజూ కావలసినంత నిద్ర - విశ్రాంతితో పాటు వత్తిడిని తగ్గించుకోవడం - లైటు వెలుగును మార్పు చేసుకోండి. చాలా అధికమైన వెలుగు తీవ్రమైన మైగ్రేన్కు కారణమౌతుంది. - అధికమైన వేడితోపాటు మసాలా వంటలు, పులిసిన పదార్థాలతో చేసిన వంటలను తినడం మానాలి. - పులుపు, వగరు పళ్లు తినడం మంచిది. - చీకటి గదిలో నిశ్శబ్దంలో విశ్రాంతి తీసుకోవాలి. - పళ్లరసాలు తాగడం ఎంతో మంచిది. (మైగ్రేన్ వల్ల వాంతులు కలిగి ఉంటే పళ్లరసాల సేవనం అత్యవసరం) - చల్లని గుడ్డను తలపై పెట్టుకోవాలి. - వాంతులు వచ్చినట్లుగా ఉంటే నిరోధించకూడదు. కొన్నిసార్లు అజీర్ణం వల్ల కూడా మైగ్రేన్ రావచ్చు. ఇలాంటి సమయంలో వాంతులు చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. - శొంఠిని గంధంలా తయారుచేసుకుని తలకు పట్టించుకొని గంటసేపు విశ్రాంతిగా పడుకొంటే మైగ్రేన్ శిరోబాధ సమసిపోతుంది.