ప్రపంచ వ్యాప్తంగా 5జీ వైపు పరుగులు పెడుతోంది. మన దేశంలోనూ 5జీని అక్కడక్కడ పరిశీలిస్తున్నారు. అయినప్పటకీ మన దేశంలో ఇంకా పూర్తి స్థాయిలో 4జీ సేవలే అందరూ అందుకోలేకపోతున్నారు. మొబైల్ తయారీ కంపెనీలు సైతం 5జీ ఉపయోగించేందుకు వీలుగా స్మార్ట్ఫోన్లకు తయారు చేస్తున్నాయి. మన దేశంలో 4జీ నెట్ వర్క్ బాగానే విస్తరించి ఉంది. అందులోనూ ప్రతి ఒక్కరూ జియో, ఎయిర్టెల్ 4జీ సేవలకు మారిపోతున్నారు. అయితే ఇప్పటికీ 4జీ నెట్వర్క్లను కొన్ని టెలికాం కంపెనీలు కొనుగోలు చేయలేదు. అందువల్ల కొన్ని ఫోన్లు 4జీ నెట్వర్క్ను యాక్సెస్ చేయగలిగేవే అయినా, ఆ తరహా నెట్ స్పీడ్ అందుకోవడం కష్టతరమవుతోంది. ఇందుకు మరో కారణం కూడా చెప్పవచ్చు. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ కలిగిన స్మార్ట్ఫోన్ల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ స్పీడ్ పరిమితంగా అందుతోంది. అయితే కొన్ని రకాల ఫోన్లలో 4జీ వేగం పెంచుకోవడానికి కొన్ని పద్ధతులు ఉపయోగిస్తే నెట్వర్క్ను అందుకునే వీలుంది. ఇందుకు కొన్ని మొబైల్ సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.
- మొబైల్ సెట్టింగ్స్లో ఫోన్ సెట్టింగ్స్కు వెళ్ళి, మొబైల్ నెట్వర్క్లో 4జీని ఎంచుకుని దానిని ఎనేబుల్ చేయాలి. దానితో పాటు యాక్సిక్ పాయింట్ నేమ్ (ఏపీఎన్)ను కూడా గమనించాలి.
న మీ ఫోన్ సెట్టింగులలో ఏపీఎన్ను రీసెట్ చేసి మొబైల్ నెట్వర్క్- యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి ఏపీఎన్ ను డిఫాల్టుగా రీసెట్ చేయడాన్ని ఎంచుకుంటే మంచిది. లేదంటే ఏపీఎన్ ఏ నెట్ వర్క్ సిమ్కు యాక్సెస్ అయి ఉంటే ఆ నెట్ వర్క్ మాత్రమే పని చేస్తుంది.
- కొన్ని యాప్స్ ఇంటర్నెట్ వేగాన్ని తగ్గిస్తాయి. బ్యాక్గ్రౌండ్లో డేటాను వినియోగిస్తూ ఫోన్ వేగాన్ని మందగించేలా చేస్తాయి. అందువల్ల ఫోన్ ఇంటర్నెట్ వేగం మొబైల్ వినియోగంపై ఆధారపడి ఉంటుంది.
- వీటితో పాటు కొన్ని ఆటోప్లే ఆప్షన్స్ వేటికైనా ఎంపిక చేసి ఉంటే వాటిని వెంటనే తీసేయండి. దీని వల్ల బ్యాక్గ్రౌండ్ డేటా వినియోగం తగ్గడంతో పాటు డేటా ఎక్కువ వినియోగాన్ని నివారిస్తుంది. ఇలా చేయడం వల్ల 4జీ వేగం పెరుగుతుంది.
- అనేక మొబైల్ ఫోన్ తయారీదారులు తక్కువ నాణ్యత కలిగిన యాంటీనాలు ఉపయోగిస్తున్నాయి.
Authorization