దూర ప్రయాణాలంటే ఎక్కు వగా రైలు ప్రయాణానికే ప్రధాన్యతనిస్తుంటాం. ప్రయాణానికి ముందుగానే టిక్కెట్టు కూడా బుక్ చేసుకుంటాం. కానీ అనుకోని కారణాల వల్ల ఒక్కోసారి ప్రయాణం కాన్సిల్ అవ్వొచ్చు. ఈ విషయం ముందుగానే తెలిస్తే టికెట్ కాన్సిల్ చేస్తుంటాం. ఇందుకు రైల్వే టికెటింగ్ ప్లాట్ఫామ్ ఐఆర్సీటీసీ ఆన్లైన్లో టికెట్లను క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. అయితే ఐఆర్సీటీసీ కొత్త రిఫండ్ నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కొత్త ఛార్జీలను వసూలు చేయనుంది. సాధారణంగా తన అధికారిక వెబ్సైట్ irctc.co.in మెబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ టికెట్ రద్దు చేసే సదుపాయాన్ని అందిస్తోంది. రైలు బయలుదేరడానికి 48 గంటల ముందే టికెట్ రద్దు చేసుకున్నట్లు అయితే కొద్దిపాటి ఛార్జీలు ప్రయాణికులు భరించాల్సి ఉంటుంది. ఏదైనా ప్రతికూల పరిస్థితుల వల్ల రైళ్లు రద్దు అయితే టికెట్ ఛార్జీలను రిఫండ్ చేయనుంది. రిఫండ్ మొత్తం బ్యాంక్ అకౌంట్కు జమవుతుంది. చార్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఐఆర్సీటీసీ ఇ-టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు. ఎలాంటి రిఫండ్ రాదు. ఐఆర్సీటీసీ వెబ్సైట్కు వెళ్లి, యూజర్ నేమ్, పాస్వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వాలి. మై అకౌంట్ లోని మై ట్రాన్సాక్షన్స్ కింద ఉన్న బుక్డ్ టికెట్ హిస్టరీపై క్లిక్ చేయాలి. క్యాన్సిల్ చేయాలని భావిస్తున్న టికెట్ను ఎంచుకుని, ఆప్షన్ బటన్పై క్లిక్ చేయాలి. రిఫండ్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు వస్తాయి. అయితే ఇలా క్యాన్సిల్ చేసిన టిక్కెట్లపై సర్వీస్ చార్జీలు పెరచేందుకు ఐఆర్సీటీసీ యోచిస్తోంది. వీటితో పాటు రైల్వేలో ప్రయాణం కూడా కాస్త ఖరీదు కానుంది. అవి కూడా వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే టిక్కెట్ల ధరలు పెరగనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఉన్న సర్వీస్ ఛార్జీలు రూ.20 నుంచి రూ.40 మధ్య ఇండియన్ రైల్వేస్ తిరిగి ప్రవేశ పెట్టే అవకాశముందని సమాచారం.
Authorization