ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తాజాగా మరో ఆఫర్ను వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. దీర్ఘకాలంగా ప్రీపెయిడ్ వినియోగించే వారికి గతంలో ఉన్న ప్లాన్ గడువును మరికొంత పొడిగించింది. గతంలో రూ.1,699తో 365 రోజుల ప్లాన్ను అందించింది. అంటే ఇప్పుడు ఈ ప్లాన్పై మరో 90 రోజులు పొడిగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అంటే 365 రోజులకు అదనంగా మరో 90 రోజులు ప్లాన్ సేవలు పొందొచ్చు. దాదాపు 15 నెలల వాలిడిటీ ఉంది. ఒక్కసారి రూ.1,699తో రీచార్జ్ చేసుకుంటే మొత్తంగా 455 రోజులు సర్వీసులు లభిస్తాయి. కంపెనీ ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా ఈ సేవలు అందిస్తోంది. ఈ సేవలు కేవలం కొద్ది కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆగస్ట్ 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు మధ్యలో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. రూ.1,699 ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు వంటి సేవలు పొందొచ్చు. అలాగే యూజర్లకు రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. ప్లాన్పై మొత్తంగా 910 జీబీ డేటాను సొంతం చేసుకోవచ్చు. ఈ ప్లాన్కు బంపరాఫర్ కూడా వర్తిస్తుంది. అంటే రోజుకు 2.2 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. మొత్తంగా ప్లాన్పై రోజుకు 4.2 జీబీ డేటా లభిస్తుంది.
Authorization