శాటిలైట్ ద్వారా మెరుగైన భద్రత, సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇస్రోతో ఇండియన్ రైల్వే చేతులు కలిపింది. జియో స్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించి దేశంలోని రైల్వే పరిధిలోని భవనాలు, స్థలాలు, దుకాణాలు, ఇతరేతరాలన్నింటికీ సంబంధించి మొత్తం ఆస్తుల జిఐఎస్ మ్యాపింగ్ ప్రాజెక్టును చేపట్టినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. అదే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) రూపొందించిన 'ది కంట్రోల్ ఆఫీస్ అప్లికేషన్ (సీఓఏ)'. దీని ద్వారా 700కుపైగా రైళ్ల రియల్ టైమ్ను మానిటరింగ్ చేయనున్నారు. ఇందులో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను అమర్చారు. ఈ సిస్టమ్ ద్వారా రెండు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న రైలు ట్రాక్ కదలికలను సులువుగా తెలుసుకోవచ్చు.
రైలుతో పాటు ప్రయాణికుల కదలికలను తెలుసుకునేందుకు భారత రైల్వే.. ఇస్రో సంయుక్తంగా సీఓఏ సిస్టమ్ను రూపొందించాయి. దీని ద్వారా సమాచారం నేరుగా కంట్రోల్ రూంకు చేరిపోతుంది. ప్యాసింజిర్ ట్రైన్ల రియల్ టైమ్ను గురించి తెలుసుకోవడంతో పాటు బొగ్గు, ఆయిల్, ఇతర సరుకుల దొంగతనం వంటి వాటిని కూడా అరికట్టవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందులా రైల్వే స్టేషన్ల మధ్యలో గూడ్స్ రైళ్లను ఇకపై నిలపాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా గూడ్స్ రైళ్లలో సరుకును దొంగతనం చేయాలని ప్రయత్నిస్తే.. వెంటనే దొరికిపోతారు. భారత రైల్వేకు గూడ్స్ రవాణా ద్వారా ఆదాయం బాగానే వస్తుంది. అయితే వరుస దొంగతనాల నేపథ్యంలో ఈ సిస్టమ్ తీసుకురావడం అనివార్యమైంది. రైల్వే మోడర్నెస్ కంట్రోల్ రూం, రైల్ నెట్వర్క్ల ద్వారా రైళ్ళ కదలికలు తెలుసుకునేందుకు ఈ కొత్త సిస్టమ్ తోడ్పడుతుందని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ వెల్లడించారు.
ఏ రైలు ఏ సమయానికి ఏ ప్రదేశంలో ఉన్నదో సులువుగా తెలుసుకోవచ్చు. ప్రమాదాలు చోటుచేసుకున్నపుడు ఈ సాంకేతికత తోడ్పడనుంది. వైఫై సేవలూ పెద్ద ఎత్తున విస్తరిస్తాయి. మనుషులు అందుబాటులో లేని క్రాసింగ్ల వద్ద రైళ్ళు రాకముందే హూటర్లను యాక్టివేట్ చేసి, రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే వారిని రిమోట్ సెన్సింగ్ సాయంతో హెచ్చరించేందుకు ఎక్కువగా ఉపయోగ పడనుంది. పేపర్లెస్ టికెటింగ్ వ్యవస్థ కోసమూ ఈ టెక్నాలజీని ఉపయోగించుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నైలలో సబర్బన్ సేవలకు రిజర్వ్ చేయని పేపర్లెస్ టికెట్లను రైల్వే ప్రారంభించింది. వీటితో పాటు సీజనల్ టికెట్లు, ప్లాట్ఫాం టికెట్లకు సైతం ఈ పద్ధతిని ఉపయోగించాలని రైల్వే నిర్ణయించింది.
Authorization