చందమామపై భారత కీర్తి పతాకం రెపరెపలాడేందుకు సమయం ఆసన్నమైంది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2తో యావత్ ప్రపంచం భారతదేశం వైపు దృష్టి సారించింది. దేశ ప్రజల ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగిలోకి దూసుకెళ్ళిన చంద్రయాన్ 2 తన లక్ష్యానికి చేరువైంది. మొత్తం 48 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి దశలోనూ విజయ బావుటా ఎగురవేస్తూ ఎట్టకేలకు చంద్రుని కక్ష్యలోకి చేరింది.
జాబిల్లి కక్ష్యలోకి..
చంద్రయాన్-2లో కీలక ఘటమైన కక్ష్య నుంచి ల్యాండర్ విక్రమ్ను సెప్టెంబరు 2న వేరు చేశారు. సెప్టెంబర్ 6 శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలంపై దిగే సమయంలో శాస్త్రవేత్తలు 'విక్రమ్' ల్యాండర్కు సంకేతాలు పంపుతారు. గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి ముందు 15 నిమిషాల వ్యవధిలో తన వేగాన్ని క్రమంగా తగ్గించుకోనుంది. అంతా సవ్యంగా ఉరదని నిర్ణయానికి వస్తే 78 నిమిషాల తర్వాత ల్యాండర్ను ఉపరితలంపై దింపడానికి ఆదేశాలు పంపుతారు. ఆ సమయంలో ల్యాండర్ వేగం 6,120 కిలోమీటర్లు ఉండగా.. చందమామకు 35ఐ100 కిలోమీటర్ల కక్ష్యలో ఉంటుంది. ఇస్రో సంకేతాలు అందగానే ల్యాండర్లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు మండటం ఆరంభిస్తాయి. ఇవి ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. అనంతరం ల్యాండర్ కిందకు దిగుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి 350 కిలోమీటర్ల ఉత్తరాన మాంజినస్ సి, సింపెలియస్ ఎన్ అనే రెండు బిలాల మధ్య ప్రాంతంలో ల్యాండర్ దిగనుంది. చంద్రుడిపై విక్రమ్ దిగే సమయానికి అక్కడ సూర్యోదయం అమవుతుంది. అందువల్ల ఈ వ్యోమనౌక తన సోలార్ ఫలకాల ద్వారా బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటుంది. భూ కేంద్రంతో నేరుగా హై బ్యాండ్విడ్త్ లింక్ను ఏర్పాటు చేసుకుంటుంది. ఆర్బిటర్ తన పరిధిలోకి వచ్చినప్పుడల్లా కమ్యూనికేషన్ సాగిస్తుంది. చంద్రుని ఉపరితలంపై చేయాలనుకున్న పనులు మొదలు పెట్టే ముందు శాస్త్రవేత్తలు ల్యాండర్ పనితీరును పరిశీలించుకుంటారు. విక్రమ్ ల్యాండింగ్ సమయంలో పైకి లేచే చంద్రుడిపై ధూళి నాలుగు గంటల తర్వాత సర్దుకుంటుంది. అప్పుడు ల్యాండర్ నుంచి ర్యాంప్ విచ్చుకోగా, దాని మీద నుంచి 'ప్రజ్ఞాన్' రోవర్ కిందకు దిగుతుంది. అయితే, ఈ రోవర్ నేరుగా భూ కేంద్రంతో అనుసంధానించలేదు. ఆర్బిటర్తో మాత్రమే కమ్యూనికేషన్ సాగిస్తుంది. ఈ రోవర్పై భారత జాతీయ పతాకాన్ని, ఇస్రో లోగోను చిత్రీకరించారు.
అనువైన ప్రాంతం
విక్రమ్ 100 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు కొన్ని సెకన్ల పాటు అక్కడ తిరుగాడుతుంది. ల్యాండింగ్ సైట్లో 500 మీ ఞ 500 మీ, 1.6 కిలోమీటర్ల పరిధిలో రెండు జోన్లను గుర్తించిన శాస్త్రవేత్తలు, తొలి జోన్లోనే ల్యాండర్ను దింపాలని నిర్ణయించారు. ఇందుకు జపాన్, అమెరికాకు చెందిన ఆర్బిటర్లు అందించిన చిత్రాలు, డేటాను విశ్లేషించి, ఈ ప్రాంతాన్ని ఇస్రో ఎంపిక చేసింది. సూర్య కిరణాల ప్రభావం వల్ల చంద్రుడి ఫోటోలను తీయడానికి వాతావరణం అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రాథమికంగా ఎంపిక చేసిన జోన్లో ల్యాండర్ దిగగలిగితే విక్రమ్ నేరుగా 65 సెకన్లలో 10 మీ ఎత్తుకు చేరుకుంటుంది. ఒకవేళ రెండో ల్యాండింగ్ సైట్ను ఎంచుకుంటే తొలుత 60 మీటర్లు కిందకు దిగడానికి 40 సెకన్లు పడుతుంది. తర్వాత 25 సెకన్లలో 10 మీ ఎత్తుకు చేరుకుంటుందని శాస్త్రవేత్త వివరించారు. 10 మీటర్లకు చేరుకున్న తర్వాత ఉపరితలంపై దిగేందుకు 13 సెకన్లు పడుతుంది. చంద్రయాన్-2 కాలుమోపుతున్న దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో వ్యోమనౌకలేవీ ఇప్పటివరకూ దిగలేదు.అనుకున్న పనులు సక్రమంగా జరుగుతున్నందున్న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2 విజయవంతంగా చంద్రునిపై కాలు మోపుతుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Authorization