సాధారణంగా దూర ప్రయాణాలంటే ఎక్కువ మంది ప్రయారిటీ ఇచ్చేది రైలు ప్రయాణానికే.. అయితే ప్రయాణం ముందుగానే తెలిసుంటే టికెట్ బుక్ చేసుకుంటాం. చివరి క్షణంలో రిజర్వేషన్ చేసుకోవాలన్నా, వెయింటింగ్ లిస్ట్లో ఉన్నా, ఎప్పుడు కన్ఫార్మ్ అవుతుందో, అసలు అవుతుందో లేదో అని కంగారు ఉంటుంది. అయితే ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇండియన్ రైల్వేస్ కూడా 120 రోజుల ముందే అడ్వాన్స్గా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు అందించింది. దీనితో పాటు ఈ మధ్య కన్ఫర్మ్ టికెట్లను అందించేందుకు ఇతర చర్యలు తీసుకుంటోంది. రియల్టైమ్ వేకెంట్ బెర్త్ స్టేటస్ అప్డేట్స్, పబ్లిక్ రిజర్వేషన్ చార్ట్స్, బయోమెట్రిక్ లింకింగ్ వంటి సేవలనూ అందిస్తోంది. దీంతో ఇప్పుడు ట్రైన్ ప్రయాణికులకు సీట్లు కన్ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు వెయిట్లిస్ట్ ప్రిడిక్షన్, ఈజీ రిఫండ్ కోసం పీఎన్ఆర్ లింకింగ్కు సంబంధించిన చర్యలనూ చేపట్టింది. ఇందులో భాగంగానే టికెట్ బుకింగ్, రిఫండ్స్, కనెక్టింగ్ జర్నీకి సంబంధించి ఇండియన్ రైల్వేస్ ఒన్నోవేటివ్ నిర్ణయాలు తీసుకుంది. అవి
వెస్ట్రన్ రైల్వే జోన్లో ఇండియన్ రైల్వేస్ ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్ లింకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో జనరల్ టికెట్ కొనుగోలు చేసిన వారి ఫింగర్ప్రింట్స్ తీసుకుంటారు. దీంతో టోకెన్ జనరేట్ అవుతుంది. ట్రైన్ ఎక్కేటప్పుడు ఆర్పీఎఫ్ పోలీసులకు ఇది చూపించాలి. దీంతో ట్రైన్లో వరుసగా సీట్లలో కూర్చొవచ్చు. ఎవరైనా దౌర్జన్యంగా సీట్లను ఆక్రమించుకోవడం కుదరదు.
ఐఆర్సీటీసీ వెబ్ పోర్టల్ అప్గ్రడేషన్తో గతేడాది ఇండియన్ రైల్వేస్ సీఎన్ఎఫ్ (కన్ఫర్మేషన్) ప్రాబబిలిటీ అనే కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీంతో బెర్త్ కన్ఫర్మేషన్ అంచనా వేసుకోవచ్చు. సీటు కన్ఫర్మేషన్ అవ్వడానికి ఎంతవరకు అవకాశముందో తెలుసుకోవచ్చు. సీఎన్ఎఫ్ ప్రాబబిలిటీ గురించి తెలుసుకోవాలంటే ఐఆర్సీటీసీ అకౌంట్లో లాగిన్ అయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో జర్నీ వివరాలు ఎంటర్ చేసి ఓకే చేయాలి. నచ్చిన ట్రైన్ ఎంచుకోవాలి. 'చెక్ అవైలబిలిటీ అండ్ ఫేర్'పై క్లిక్ చేయాలి. సీట్లు లేకపోతే సీఎన్ఎఫ్ ప్రాబబిలిటీపై క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ ఛాన్స్ తక్కువగా ఉంటే ఇతర ట్రైన్ ఎంచుకోవడం మంచిది.
ఎయిర్లైన్ స్టైల్ మోడల్ మాదిరి ఇండియన్ రైల్వేస్ కూడా ఇటీవల రిజర్వేషన్ చార్ట్ను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో చార్ట్ ప్రిపేర్ అయ్యాక ఖాళీగా ఉన్న సీటు వివరాలు చూడొచ్చు. ఫస్ట్ చార్ట్ ఆన్లైన్లో ట్రైన్ బయలు దేరడానికి 4 గంటల ముందు రెడీ అవుతుంది. రెండో చార్ట్ ట్రైన్ బయలు దేరడానికి 30 నిమిషాల ముందు ప్రిపేర్ చేస్తారు. అలాగే ట్రైన్లోని అన్ని కోచ్ల లే అవుట్ కూడా కనిపిస్తుంది. సీట్లు అందుబాటులో ఉన్నప్పుడు టీటీఈ కూడా ఏం మాట్లాడటానికి లేదు. టికెట్ తీసుకొని వెళ్లి కూర్చొవచ్చు. లేదంటే టీటీఈ దగ్గరే టికెట్ తీసుకోవచ్చు.
కనెక్టింగ్ ట్రైన్ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం కోసం ఇండియన్ రైల్వేస్ పీఎన్ఆర్ లింకింగ్ సదుపాయాన్ని తీసుకువచ్చింది. దీంతో ప్రయాణికులు రెండు పీఎన్ఆర్లను లింక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ప్రయాణికుడు తన గమ్యస్థానానికి వెళ్లాలింటే రెండు రైళ్ళు ఎక్కాలి. ఒక రైలు జర్నీ లేట్ కావడంతో కనెక్టింగ్ రైలు మిస్ అవుతుంది. ఇలా అయినపుడు కనెక్టింగ్ రైలు టికెట్ ధరను రిఫండ్ పొందొచ్చు.
ఇండియన్ రైల్వేస్ తన శతాబ్ది, రాజధాని వంటి ప్రీమియం ట్రైన్స్లో హ్యాండ్హెల్డ్ టర్మినల్స్ (హెచ్హెచ్టీ) సేవలు లాంచ్ చేసింది. హెచ్హెచ్టీ అనేది జీపీఎస్ ఆధారిత మినీ ట్యాబ్లెట్ డివైజ్. దీన్ని టీటీఈలకు ఇస్తారు. ఆయన దీంతో రియల్టైమ్ రన్నింగ్ ట్రైన్ ఆక్యుపెన్సీని తెలియజేస్తారు. ట్రైన్లో ఖాళీ ఏమైనా ఉంటే రాబోయే స్టేషన్లోని ప్యాసింజర్ల టికెట్లు కన్ఫార్మ్ కావొచ్చు. వెయిట్లిస్ట్, ఆర్ఏసీ టికెట్లు కలిగిన వారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. రన్నింగ్ ట్రైన్లో టీటీఈ టికెట్లను చెక్ చేస్తూ, ఎవరైనా రిజర్వేషన్ చేసుకున్నవారు ఎక్కకపోతే ఆ వివరాలు ట్యాబ్లెట్లో ఎంటర్ చేస్తారు. అప్పుడు ఆ సీటు ఆర్ఏసీ లేదా వెయిట్లిస్ట్ వారికి కన్ఫార్మ్ అవుతుంది.
Authorization