ఇప్పుడు ప్రతీది ఆన్లైన్. షాపింగ్, ఫుడ్, జర్నీ ఇలా ఇదైనా సరే ఆన్లైన్లో పనులు పూర్తి చేస్తున్నాం. అరదుకు తగినట్టే మోసాలూ పెరుగు తున్నాయి. సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త పంథాలు వెదుకుతున్నారు. ఒక మోసం గురించి జనాలకు పూర్తిగా తెలిసేలోపు మరో మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మధ్యే యూపీఐ స్కామ్, పేటీయం కేవైసీ స్కాం, వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాంలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలకు వీటి గురించి అవగాహన కలిగిలోపే ఇప్పుడు మరో కొత్త ఆన్లైన్ స్కాం బయటకు వచ్చింది. అదే డెలివరీ మెసేజ్ స్కామ్. డెలివరీ ప్యాకేజీ మీ ఇంటికి చేరాలంటే లింక్పై క్లిక్ చేసి వివరాలు అందించండి అని ఒక లింక్ చూపిస్తుంది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి పొరపాటున బ్యాంకు వివరాలు అందిస్తే చాలు యూపీఐ ఆధారంగా అకౌంట్లో డబ్బులు ఖాళీ అవుతాయి. అదెలా అంటే.. ఆ లింక్ ఒక నకిలీ వెబ్సైట్కు రీడైరెక్ట్ అయి ఉంటుంది. ఆ వెబ్సైట్ బ్యాంకింగ్ వివరాలు అడుగుతుంది. అలా అక్కడ మీ వివరాలను అందించారంటే మాత్రం ఆ సమాచారం ఆధారంగా మీ అకౌంట్ ఖాళీ చేస్తారు. ఈ మోసం విషయమై ఖీవసజుఞ డెలివరీ సంస్థ ఇప్పటికే తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. మెయిల్, మెసేజ్ ద్వారా తాము వినియోగదారుల వ్యక్తిగత వివరాలను సంస్థ అడగమని పేర్కొంది. ఇలాంటి అనుమానాస్పద మెసేజ్లు తమ సంస్థ పేరిట వస్తే.. ఆ మెసేజ్ను వెంటనే డిలీట్ చేసి, దానికి సంబంధించిన వివరాలను తమకు అందించమని కోరింది. ఎక్కువ మంది మోసగాళ్లు ఈ బ్రాండ్ పేరునే ఉపయోగిస్తూ ఉండటంతో ఫెడెక్స్ ఈ హెచ్చరికలను జారీ చేసింది. తమ సంస్థ కేవలం ఒక మెసేజ్ను పంపించడం ద్వారా వినియోగదారులను నగదు చెల్లించమని కోరదని తెలిపింది. ఇటువంటి ఈ-మెయిల్స్ కారణంగా తమ సంస్థ పేరుకు నష్టం కలుగుతోందని పేర్కొంది. గతంలోనూ ఏదో కస్టమర్ కేర్ నంబర్ నుంచి కాల్ చేసి మీకు ఒక పార్శిల్ వచ్చిందని, దాని కోసం కొంత ట్యాక్స్ చెల్లించాలని చెప్తారు. వారిని నమ్మి మీరు నగదు చెల్లించారంటే నట్టేట మునిగినట్లే. కానీ ఇలాంటి మోసాలపై ప్రజలకు అవగాహన వచ్చినందున ఈ మధ్యకాలంలో కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏదేమైనప్పటికీ ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
Authorization