ప్రస్తుతం జరుగుతున్న ట్రాన్సాక్షన్లు మొత్తం ఆన్లైన్లోనే. అయితే ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోతుపన్న నేపథ్యంలో వినియోగదారులకు ఆయా సంస్థల నుంచి హెచ్చరికలు, సూచనలు జారీ అవుతున్నాయి. అందులో పేటిఎం సంస్థ ఇప్పటికే తన వినియోగదారులను హెచ్చరించింది. తాజాగా గూగుల్ పే విషయంలోనూ అదే మాటలు వినిపిస్తున్నాయి. పేటీయం, గూగుల్ పే వంటి ఈ-వ్యాలెట్ యాప్స్పై ఈ మధ్యకాలంలో కేసులు నమోదయ్యాయి. పేటీయం కేవైసీ చేసుకోకుంటే అకౌంట్ బ్లాక్ చేస్తాం అనే కాల్స్ వస్తుండడంతో, నమ్మి మోసపోవద్దని వినియోగదారులను సంస్థ హెచ్చరించింది. ఈ విషయంపై కేసులు సైతం నమోదవ్వడంతో పోలీసులూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం..
- ఏ సంస్థ కూడా కేవైసీని ఫోన్ కాల్లో ధ్రువీకరించదు. అటువంటి మెసేజ్లు వస్తే జాగ్రత్త పడాలి.
- ఎస్ఎంఎస్లో కానీ, ఈ-మెయిల్లో కానీ ఏవైనా అనుమానాస్పద లింకులు వస్తే వాటిని అస్సలు క్లిక్ చేయవద్దు. ఆయా లింకుల మీద క్లిక్ చేసినా, క్లిక్ చేసిన అనంతరం వాటిలో కోరిన వివరాలను అందించినా.. మీ వ్యక్తిగత సమాచారం చోరీ అవ్వడం, బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం.
- కేవైసీ ఎస్ఎంఎస్లో ఈ నంబర్కు కాల్ చేయండి అని ఉంటుంది. అటువంటి నంబర్కు అస్సలు కాల్ చేయవద్దు. అది మోసపూరితమైనది. బ్యాంకు ఖాతాలో నగదు కోల్పోయే అవకాశం ఉంటుంది.
- ఫోన్కాల్స్లో ఆయా యాప్స్కు సంబంధించిన ప్రతినిధులుగా చెప్పుకునే వారు తెలిపారని ఒక్క రూపాయి కూడా లావాదేవీ చేయవద్దు. ఎవరైనా కాల్ చేసి లావాదేవీలు చేయాలంటే వెంటనే ఆ యాప్కు, పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- కస్టమర్ ఎగ్జిక్యూటివ్లు చెప్పారని యాప్లను డౌన్లోడ్ చేయవద్దు. ఈ-వ్యాలెట్ యాప్స్కు సంబంధించి కాల్ చేసే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరూ మిమ్మల్ని థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పరు. కాదని అలా చేస్తే ఫోన్ వారి అధీనంలోకి వెళ్ళే అవకాశం ఉంది.
Authorization