Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రం వచ్చినప్పటి నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త పంచాయతీ ముందుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. లక్ష ఇండ్లు సిద్ధంగా ఉన్నాయని అధికార పార్టీ నాయకులు చెబుతుంటే... కేవలం మూడు వేల వరకు మాత్రమే నిర్మాణం పూర్తయినవి ఉన్నాయని ప్రతిపక్షాలవారు ఆరోపిస్తున్నారు. మరో వైపు శివారు ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లను కూడా గ్రేటర్ వాసుల కోసమంటూ అధికార పార్టీ మరోసారి మోసానికి తెగబడిందని విమర్శిస్తున్నారు. పేదలు మాత్రం దీర్ఘకాలంగా తమకు ఇండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పథకానికి సంబంధించి రాజకీయ నాయకుల మాటలతో నెలకొన్న సందేహాలకు మాత్రం సంబంధిత అధికారులు వివరణ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోవడం గమనార్హం. ఎన్నికలకు చాలా ముందు ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెచ్చిన ఇండ్ల అంశం ప్రధానంగా మారనున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
- కొత్తూరు ప్రియకుమార్