Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేరుకే పెద్ద పోస్టులు, హౌదాలు తప్ప, అధికారాలేవీ లేని 'కరివేపాకు'లు వాళ్లు. 'ప్రగతి' రధ చక్రాలు పక్కకు ఒరుగుతున్నా, మానసిక క్షోభ కోత పెడుతున్నా, చూసీ చూడనట్టు నటించడమే తప్ప, అదేంటని ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేని నిస్సహాయులు. కాకపోతే ఎంత నియంత్రించు కుందామనుకున్నా సాధ్యం కాని 'అసహనం' ఒక్కోసారి వాళ్లలోని దైన్యాన్ని బయటపెట్టేస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే... హైదరాబాద్లో సిటీ బస్సులు ఎప్పటి నుంచి తిప్పుతారు సార్ అంటూ టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్కు చెందిన ఓ అధికారికి ఫోన్ చేస్తే... ఆయన కస్సున లేచారు. 'ఏమో... నాకేం తెలుసు... ఎమ్డీని అడుక్కోండి' అనేశారు. అదేంటి సార్... మీరు గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారి కదా! మీకు తెలీకుండా బస్సులు నడుస్తాయా? అంటే...'అన్నీ మాకు చెప్పే చేస్తారా? వాళ్ళిష్టం' అన్నారు. పత్రికలో ఇదే రాయమంటారా అంటే...'ఆ... రాసుకోండి' అనేశారు. ఇదేంటి ఆయన ఇలా మాట్లాడుతున్నారని, అదే శాఖలోని మరో అధికారికి ఫోన్ చేసి, విషయం చెప్తే 'ఏం చేస్తారు సార్... పేరుకే పెద్ద పోస్టులు. నిర్ణయాలన్నీ ప్రగతిభవన్ నుంచే' అంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. ఈలోపు టీవీల్లో 'రేపటి నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు... ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ప్రకటించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్' అంటూ స్క్రోలింగులు రాబట్టే... అప్పటిక్కానీ ఆ అధికారి ఆక్రోశావేదన అర్ధంకాకపాయే! కొసమెరు పేంటంటే... టీవీల్లో స్క్రోలింగులు చూసే దాకా, సిటీలో బస్సులు తిప్పాలనే విషయం ఈడీకే తెలియదని తేలింది. ఎందుకంటే సీఎంతో మీటింగ్కి సంబంధిత ఆ అధికారిని పిలవనేలేదట! అట్లుంది... సర్కారీ పీడన... కాదు కాదు... పాలన!! - ఎస్ఎస్ఆర్ శాస్త్రి