Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో నేరాలూ రాజకీయాలు పెనవేసుకుని ఉన్న రాష్ట్రాల జాబితాలో మొట్టమొదటి స్థానం ఉత్తరప్రదేశ్దే అన్న విషయంలో ఎటువంటి సందేహానికీ తావులేని విధంగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా గ్యాంగ్స్టర్ ల రాజ్యం కొనసాగుతూనే వస్తుంది. రాష్ట్రంలో నేరాలను అదుపు చేస్తానని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గట్టిగా చెప్పిన యోగి తొలినాళ్లలో చేసిన హడావుడి చూసి అంతా ఇక నేరమయ రాజకీయాలకు తావులేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని ఆశించారు. అయితే ఆ హడావుడి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో 19ఏండ్ల దళిత యువతిని అదే గ్రామానికి చెందిన నలుగురు అగ్రకుల యువకులు భయంకరమైన చిత్రహింసలు పెట్టి, వెన్నెముక విరిచేసి సామూహిక అత్యాచారానికి పాల్పడి, సాక్ష్యం చెప్పకుండా నాలుక కోసివేయడం అత్యంత అమానుషమైన సంఘటన. ఈ దుర్మార్గం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. సెప్టెంబర్ 14న పశువుల మేత కోసం తల్లితోపాటు పొలంకెళ్లి కొంచెం దూరంలో ఉండి గడ్డి కోస్తున్న అమ్మాయిని దుప్పట్టా పట్టుకొని లాగి దూరంగా ఈడ్చుకెళ్లి ఈ అకత్యానికి పాల్పడ్డారు. కూతురు కోసం వెతుక్కుంటూ వెళ్లిన ఆ తల్లికి తీవ్ర రక్తస్రావంతో చిత్రహింసలకు గురై నేలపై పడిపోయి కనిపించింది. ఆ అమ్మాయి కదలలేని స్థితిలో ఉన్న ఆమెను తీసుకుని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తీవ్రమైన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె ఆస్పత్రిలో పదిహేను రోజులపాటు తీవ్రమైన క్షోభను అనుభవించి సెప్టెంబర్ 29న మరణించింది.
అధికార యంత్రాంగం బాధితుల పట్ల వ్యవహరించిన తీరు అత్యంత అమానుషమైనది, దుర్మార్గమైనది. బాధితురాలి మతదేహాన్ని కూడా తల్లితండ్రులకు ఇవ్వకుండా పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తగులబెట్టేయడం. మరీ దారుణం. నేరస్థులకు అండగా నిలబడడం కోసం, వారిని రక్షించుకోవడం కోసమే బాధితురాలితో పాటు సాక్షాలను కాల్చేసారనే విమర్శ ఉంది. గ్రామీణ భారతంలో అగ్రకుల పెత్తందారీ దోపిడీ శక్తుల పట్టు ఎంత బలంగా ఉందో, వారికి వ్యవస్థలన్నీ ఎలా రక్షణ కవచాలుగా ఉంటాయో ఈ ఘటన మరొక్కసారి రుజువు చేస్తున్నది. మహిళలపై ,ఆడపిల్లలపై గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా భూస్వామ్య, పెత్తందారీ శక్తులు సాగిస్తున్న దౌర్జన్యాలు, లైంగిక హింసలు బైటకి రాకుండా పాతాళంలోతుల్లోకి పాతి పెట్టేస్తారు. ఇలాంటి హింసాత్మక ఘోరమైన ఘటనలు సమాజం దష్టిలోకి వచ్చినప్పుడు, బాధితులకు న్యాయం చేస్తామని మాట్లాడుతూనే నేరస్తులని కాపాడుకోవడం కోసం ఎంతకైనా బరితెగిస్తారని ఈ ఘటన మరింత స్పష్టం చేస్తున్నది. తనని నలుగురు యువకులు అత్యాచారం చేసి హింసించారని బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ దానిని పరిగణనలోకి తీసుకోకపోవడం అత్యంత దుర్మార్గం. ఘటన జరిగి 15రోజులకు పైనే అయినా కూడా అధికారంలో ఉన్న బీజేపీ పాలకులు ఇంతవరకు నిందితులపై సరైన చర్యలు తీసుకోకపోవడం ఘోరమైన విషయంగా పరిగణించాలి.
మహిళలపై హింసాత్మక లైంగికదాడులు, హత్యలు ఎంత తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయో వివిధ అధ్యయనాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెరుగుతున్న ఈ అమానుష హింసాత్మకదాడులను ప్రతిఘటించగల సంఘటిత ఉద్యమాలను నిర్మించుకోవడం నేటి అవసరం. ప్రజల ప్రజాతంత్ర హక్కులను కాలరాసే ప్రభుత్వాల అసలు స్వభావాన్ని ప్రజలమధ్య నిరంతరం ఎండగట్టాలి. బూటకపు ప్రజాస్వామ్య నినాదాల మాటున ఎన్ని వేల, లక్షల మంది దళిత, శ్రామిక కులాల మహిళల, ప్రజల ప్రాణాలు ఆహుతవుతున్నాయో నిరంతరం మనం ప్రజలకు వివరించుకోవాలి. ఈ హింసాత్మక దాడులకు వ్యతిరేకంగా యావత్ ప్రజానీకం తమ స్పందనలను, నిరసనను, ఆగ్రహాన్ని బలమైన గొంతుతో వ్యక్తం చేయడం నేటి అవసరం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటీవల ఎన్ని ఘటనలు జరిగాయో, జరుగుతూనే ఉన్నాయో లెక్కేలేదు. ప్రధానంగా పెత్తందారీ దురహంకార శక్తులకు బలానిచ్చే పాలకులున్నచోట, ఎలాంటి శిక్షలూ మనకు పడవనుకున్నచోట ఆయా శక్తులు మరింత పేట్రేగిపోవడం మనమంతా చూస్తున్నాం. బాధితులను రక్షించడం కోసం, నేరస్తులను శిక్షించడం కోసం అంటూ తెచ్చే కొత్త చట్టాలు, శిక్షలు సామాన్యుల కంటితడి తూడ్చడానికి తప్ప వ్యవస్థలో మార్పు తీసుకరావడనికి ఉపయోగపడటం లేదు.
- డా.ఎస్. మల్లేశ్వర్
సెల్:9866255355