Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూరోపియన్ మీడియా భారత దేశానికి అధికారం బదిలీ అయ్యే సమయంలో భారత ప్రజాస్వామ్యం యొక్క వైఫల్యం గురించి ఊహించింది. కులం అనేది ఒక జీవన విధానం అని, వారి రోజు వారీ జీవితాన్ని కులమే నిర్ణయిస్తుందని వారి నమ్మకం. అందువలన భారతీయులు రాజకీయాలను, ఎన్నికలను సరిగా అర్థం చేసుకోలేరని అనుకుంది. 1952 ఎన్నికల్లో పోలింగ్ బూత్ల వద్ద పాము ఆకారంలో నిలబడిన ఓటర్లను గమనించిన బీబీసీ ఆశ్చర్యపోయింది. ''మన పాలనా'' సందేశం ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో పాల్గొన్న ప్రజానీకానికి చేరింది. నాయకులు ఉన్నత సాంప్రదాయ కులాల నుంచి వచ్చారు. తక్కువ కులాలకు చెందిన ఓటర్లు వినయంగా తమ నాయకులను అనుసరించారు. కులం సుదీర్ఘ కాలంగా మనగలుగుతూ వస్తున్న వ్యవస్థలలో ఒకటి. అందువల్ల ప్రజలు దొంతరల వ్యవస్థలో తాము ఉన్న స్థానాన్ని బట్టి తమ ఆలోచనలను శృతి చేసుకున్నారు. కింది కులాలకు చెందిన ఓటర్లు ఎన్నికల్లో తమ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు చెప్పిన విధంగా నడుచుకునే వారు. ఆ విధంగా కులం అనేది భారత ప్రజాస్వామ్యానికి ఒక పునాది అయింది.
బ్రిటిష్ పాలనా కాలంలో కులాన్ని భావజాల వ్యక్తీకరణగా సక్రమ వ్యవస్థీకరణ చేసి దాని మార్గ నిర్దేశాన్ని మార్చారు. భారతీయ సమాజంలోకి చొరబడేందుకు సాంప్రదాయ మేథావులైన బ్రాహ్మణులు వలసవాదులకు అవసరం. కాబట్టి వారు వలస పాలనా యంత్రాంగంలో నియమితులయ్యారు. మేము కూడా బ్రాహ్మణుల లాగా ''మంచి కులానికి'' చెందిన వారమని వైశ్యులు, బ్రాహ్మణులతో పోటీ పడ్డారు. అంటే మంచి మంచి స్థానాలు పొందిన వారంతా ''మంచి కులాలకు'' చెందినట్టు, మిగిలిన వారు తక్కువ కులాలకు చెందిన వారు అయ్యారు. శూద్రులు లాంటి ఇతరులు అనాగరికులని, దుష్ట స్వభావం కలిగిన వారని, స్థిర నివాసాలు లేని వారు దొంగలుగా, దోపిడీ దారులు, నేర చరిత్ర ఉన్న జాతి వారని అనుకున్నారు. కులం గురించి ఉన్న ఈ భావనలే బ్రిటిష్ పాలనకు పునాదిగా మారాయి.
వలస వాదుల సిబ్బంది, వలస వాద మనస్తత్వంతో ఉండి, బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంటూ వారిని ప్రగతిశీల శక్తులుగా చూశారు. వారి అభిప్రాయంలో, వెనుకబాటుతనానికి గుర్తుగా ఉన్న భారతదేశాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్వారి కింద ఉన్న సంస్కరణ వాదులు భారతదేశానికి ఒక గౌరవం తెచ్చేందుకు భారతీయ సమాజాన్ని సంస్కరించడం ప్రారంభించారు. వారు బ్రిటిష్ వారితో సతీసహగమనాన్ని రద్దు చేయడం, బాల్యం వివాహాల రుద్దు చేయడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడం ద్వారా భారతీయ సమాజాన్ని సంస్కరించేందుకు తరచుగా కలిసేవారు. అదే విధంగా వారు కుటుంబంలోని భార్యాభర్తలు చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఒకరినొకరు 'డార్లింగ్' అని పిలుచుకునే విధంగా కుటుంబంలోకి ''శంగారపూరితమైన ప్రేమను'' తీసుకొని వచ్చారు. వారి వస్త్రధారణ ప్యాంట్, చొక్కా, బూట్లు, మైజారు చీర, లహంగా, బిగుతైన జాకెట్కు మారింది. ఈ మార్పు కేవలం బ్రిటిష్ వారికి సన్నిహితంగా ఉండే భారతీయ సమాజంలోని ఉపరితలంపై ఉన్న వారిలో వచ్చింది. ఆ విధంగా తక్కువ కులాలకు చెందిన వారు అదే వెనుకబాటుతనంతో ఉన్న వారిగానే మిగిలిపోయారు.
బ్రిటిష్ వారితో ఇంగ్లీష్ మాట్లాడగలిగే వారు కావడం వల్ల ఇంగ్లీష్ సాహిత్య పండితులు ''మేథావి వర్గం''గా ఉన్నారు. ఇంగ్లీష్ మాట్లాడే భారతీయులు అందరు మొదటి భారతీయ మేథావులు అయ్యారు. ఇంగ్లీష్ మాట్లాడని బ్రాహ్మణులు కూడా వట్టి పండితులుగానే మిగిలారు. కింది కులాలకు చెందిన వారు ఇంకా వత్తి దారులుగా ఉన్నారు. మేథావి వర్గంలో కొందరు భారత దేశంలో జాతీయతా భావాలను పెంపొందించుకొని రాజకీయాల వైపు మరలినారు. వారంతా జాతీయతా భావాలు ఉన్న మేథావి వర్గానికి చెందిన వారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వారు భారతదేశాన్ని ఒకే ప్రజలకు చెందిన జాతిగా గుర్తించారు. వారిదష్టిలో కులం అనేది అసాధారణమైనదనీ, అందుకే భారతీయులంతా ఒక్కటే అని అంటారు. అంటరాని తనం ఒక నేరం అని వారు ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం అందరూ ఒక్కటే అని, ప్రతీ ఒక్కరూ ప్రజా సమూహ పరిధిలోకి వస్తారు. కానీ వారి స్వంత విషయాలలో మాత్రం వారి కులాలకు చెందిన వారినే వివాహం చేసుకున్నారు. వారి ఆడ పిల్లలను చదువుకోడానికి ఇతర పిల్లలతో పాటు ప్రభుత్వ పాఠశాలకు పంపలేదు. ఉన్నత కులాలకు చెందిన వారి పిల్లలు తరగతి గదుల్లో ఉండి చదువుకుంటే తక్కువ కులాలకు చెందిన వారి పిల్లలు తరగతి గది బయట కూర్చుని పాఠాలు విన్నారు. జాతీయవాదం పేరుతో, స్వాతంత్య్రం పేరుతో కులాలు సవాళ్ళను ఎదుర్కొవాల్సి వచ్చింది, కానీ అంతర్గతంగా మేథావి వర్గం మాత్రం కులాల నిర్మూలనకు నిలబడేంతగా ఎదగలేదు. గమనిస్తే జాతీయ రాజకీయాల్లో భంగి కాలనీల్లో వారిని ఐక్యం చేసేందుకు వారితో పాటు కలిసి జీవించిన గాంధీజీ తాగుబోతు అయిన తను కొడుకు ఒక ముస్లిం మహిళను వివాహ మాడడాన్ని వ్యతిరేకించాడు. ఫిరోజ్తో ఇందిరాగాంధీ వివాహాన్ని నెహ్రూ వ్యతిరేకించాడు. ఇందిరాగాంధీకి ఆమె వివాహాన్ని వ్యతిరేకిస్తూ వేల కొలది టెలిగ్రామ్లు పంపడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్రాహ్మణ మేథావి వర్గం తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఆధునిక మేధావులకు, జాతీయతా భావాలు కలిగిన నాయకులకు రెండు ముఖాలు ఉన్నాయి. బయటికి కనిపించేది స్వాతంత్య్రం కోసం కాగా, అంతర్ముఖంగా భారత దేశంలో కుల వ్యవస్థను కొనసాగించడం. జాతీయతా భావం కుల సంస్కతిని తీసుకొని వచ్చినప్పటికీ, బ్రిటిష్ వారికి, ప్రపంచానికి మాత్రం అందరూ ఐక్యంగా ఉన్నట్టే కనిపించారు. జాతీయతావాద భారత దేశం ఒక కుల భారత దేశం, కానీ ప్రగతిశీల భారత దేశమే స్వాతంత్య్రం సాధించి బ్రిటిష్ పాలన నుంచి భారతీయులకు స్వేచ్ఛను కల్పించింది. అది ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థను సాధించింది. బ్రాహ్మణేతర ఉద్యమాలు, అణగారిన వర్గాల ఉద్యమాలు, షెడ్యూల్డ్ కులాల ఉద్యమాలు కూడా 1930 చివరి కాలంలో, 1940లో కాంగ్రెస్ జాతీయవాదంతో కలిశాయి, ఆ విధంగా వారు కూడా జాతీయోద్యమంలో భాగస్వాములు అయ్యారు.కింది కులాల వారు కూడా కుల రాజకీయ నాయకులను ప్రోత్సహించారు. కులాలు ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకుని వచ్చారు. స్వాతంత్య్ర సముపార్జన ఒక చారిత్రక విజయం అవడం వల్ల చరిత్రకారులు ఈ అనర్హత (కులం)పై పెద్దగా దష్టి సారించ లేదు. చారిత్రకంగా తిరిగి పుంజుకున్న కులాలే భారత దేశ స్వాతంత్య్రానికి పునాది అయింది. స్వాతంత్య్ర సాధనకు కులం నిర్మూలన ఎజెండాను ముందుకు తీసుకొని పోవడం సాధ్యం కాలేదు. ఇది చారిత్రకంగా వారసత్వంగా వచ్చిన వ్యవస్థలలో ఒకటి. చరిత్ర దానిని వదిలివేసే విధంగా పరిణితి చెందాల్సి ఉంది. జాతి సమానత్వ భావనను, సామాజిక న్యాయం నియమాలను అంగీకరించింది. జాతి అంటే అన్ని భాషల, మతాల, కుల సమూహాల సమ్మిళితమైన జీవితం. సామాజిక న్యాయ భావన రాజ్యాంగ నిర్మాతల గొప్ప ఆవిష్కరణ. అందుకే మన రాజ్యాంగం ప్రత్యేకమైనది. అది భారతీయులంతా ఒక్కటే అని ప్రకటించింది, కానీ ఇతరులతో సమానమైన స్థితి వచ్చేంతవరకు కొంత మంది ప్రజలను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలుగా గుర్తించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, రాజ్యాంగం రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వ్యక్తులకు తప్ప మిగిలిన వారికి కుల ధవీకరణ పత్రాలు ఇచ్చే అధికారం రాజ్యానికి ఇవ్వలేదు. కాబట్టి రాజ్యాంగం దష్టిలో భారతదేశంలో కులం అనేది లేదు.
ఆధిపత్యమే, ప్రజాస్వామ్యం ఏ కుల సమూహం పాత్ర ఏమిటి అనేది నిర్వచించే నిర్ణయం చేస్తుంది. రాజకీయ పార్టీలను ఆక్రమించిన ఆధిపత్య కులాలే, కులాల ఆధారంగా అధికారం చేజిక్కించుకునే ఏర్పాట్లు చేశాయి. నిమ్న కులాలకు చెందిన కింది స్థాయి రాజకీయ నాయకులను రాజకీయ స్థానాలలో సర్దుబాటు చేశారు. ఉదాహరణకు, అంబేద్కర్ను రాజకీయాలలో లేకుండా చేశారు, కానీ అతని ఆప్తులు, ఆత్మీయులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారు. నిమ్న కులస్థులు కేవలం తమకు ఓటు హక్కు కలిగి ఉండే స్థితిని అంగీకరించారు. ఎన్నికల సమయంలో వారు కుల సమూహాలుగా బేరమాడే పరిస్థితులను కల్పించారు.
సాంప్రదాయ బద్దంగా కులం నిమ్న కులస్థుల ఇంటి పేరుగా ఉంటుంది. ఇప్పుడు నిమ్న కులస్థులు తమ కులాలను, పై కులాలను అనుసరిస్తూ, వారెవరో తెలుసుకునే విధంగా పేర్ల చివర ఉన్న పదాలను ఉపయోగిస్తూ సున్నితమైన విషయంగా చూస్తున్నారు. ఉదాహరణకు, మాదిగ పుల్లయ్య, పుల్లయ్య మాదిగ అయ్యాడు. నాయకుల పేరుకు చివర ఉండే ''మాదిగ'' అనే పదం బ్రాహ్మణ సాంప్రదాయానికి వ్యతిరేకం కాదు, కులానికి వ్యతిరేకం కాదు, కానీ ఇతర కులాల వెలివేతకు వ్యతిరేకం. ఇది బేరమాడేందుకు కుల ''నాయకులకు'' వ్యక్తి గతంగా లాభసాటిగా ఉంటుంది. కొంత మంది వెనుకబడిన కులాలకు చెందిన వారు తమ కంటే తక్కువ కులానికి చెందిన వారితో ఉన్న తేడాను చూపేందుకు పేరు చివర కులాలను జోడిస్తున్నారు తప్ప వారి మొత్తం బీసీ కులాలను బలోపేతం చేసేందుకు కాదు.
రాజకీయ బలం, పాలనాధికారాన్ని అందించిన సంస్కతీ కరణ ద్వారా పేరు చివర ఉండే రెడ్డి, చౌదరి అనే పదాలు వారికి గుర్తింపు ఇచ్చాయి. కింది స్థాయిలో ఇతర కులాలను అనుసరించే విధానం వారిలో అనైక్యత కు కారణభూతమైన వర్గీకరణ కు దారి తీసింది. ఎన్నికల సమయంలో వారి రాజకీయ అవతారాలను చూస్తే, పోటీ చేసే అభ్యర్థుల నుండి డబ్బు కోసం వారిని ప్రాధేయపడేందుకు చిన్న నాయకులు అంతా బయటికి వస్తారు. వారిలో కొందరు కులం పేరుతో ''నాయకులు'' అవుతారు. కానీ చివరకు నాయకుల ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. స్థిర నివాసాలు లేని వారి కులాల పేర్లు ప్రజల పరిభాషలో తిట్లుగా ఉన్నాయి. ఇంకా వారిలో వలసవాద కాలం నాటి మనస్తత్వం ఉండి వారు కులాల పేర్లతో పిలుచుకుంటారు. వారు జాతీయ భావాల మనస్తత్వాన్ని అలవరచుకొని, తరువాత సామాజిక న్యాయం గురించి ఆలోచన చేయాలి. ఈ విభజన ధోరణి కులతత్వ ధోరణి, కానీ రాజ్యాంగంలో లిఖించబడిన సామాజిక న్యాయంకాదు. నాయకులంతా కులాలను పక్కన పెట్టి రాజ్యాంగ స్ఫూర్తితో సామాజిక న్యాయ ఉద్యమాలు ప్రారంభించాలి.
- ప్రొ||ఇనుకొండ తిరుమలి