Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహనం కొంతమేరకే. అది నశించిపోతే నివురుకప్పిన నిప్పులా గుప్పుమంటుందనేది నగసత్యం. టీఆర్ఎస్ అధికాంరలోకి వచ్చినప్పటి నుంచి ఏం చెప్పితే అది నడిచింది. గడీలో కూర్చొని పాలన సాగించినా ప్రజలు నిజమే అనుకున్నారు. అక్కడక్కడ గొంతేత్తితే అణిచివేశారు. కేసులు పెట్టారు. కానీ తాజాగా పరిస్థితులు మారుతున్నాయి. అసంతృప్తి దావనంల రాజుకుంటుంది. ఇక ప్రజలు నమ్మే పరిస్థితులు సన్నగిల్లుతున్నాయి. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు ఉదాహరణ. తమ సమస్యలను పరిష్కరించాలని కోరడం, ప్రశ్నించడం, అడగడం, నిలదీయడం సాధారణ నిరసన. కానీ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలపై చెప్పులు, రాళ్ల్లు,రప్పలు విసురుతున్నారు. ఫార్మాసిటీ విషయంలో భూములు లాక్కుంటున్న ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో ఉన్న ప్రజలు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిపై చెప్పులు,కర్రలు విసిరారు. అక్కడి నుంచి పరారైన పరిస్థితి వచ్చింది. అదే విధంగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావుపై రాళ్లు రువ్వారు. చుట్టపుచూపుగా వస్తూ ఏ సమస్యను పరిష్కరించడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకుని కష్టాల్లో ఉంటే కూడా పట్టించుకోవడం లేదని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక మహిళలు కొంగు నడుముకు చుట్టారు. అల్మాస్గూడలోని పెద్దబావి వద్ద ఇండ్లలోకి నీరొచ్చిన ప్రజలు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిలదీశారు. మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చేదాక వదల్లేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. ఏలికలూ... తస్మాత్ జాగ్రత్త...
- గుడిగ రఘు