Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తక్షణ సహాయం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించాలి. కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ నిండా మునిగింది. జనజీవనం అస్తవ్యస్తం కావడంతోపాటు చేతికొచ్చిన పంట నీట మునిగి పొయినది. తెలంగాణలో వర్ష బీభత్సంపై ఏరియల్ సర్వే నిర్వహించాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నదాతలు నిలువునా మునిగిపోయారు. చేతికొచ్చిన వరి, పత్తి సహా అన్ని పంటలు నీటిలో మునిగిపోయి రైతులు ఆవేదన చెందుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇండ్లు నేలమట్టం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రవాణా వ్యవస్థ స్తంభించింది. రాజధాని నగరం పూర్తిగా నష్ట పోయింది. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రూ.5వేల కోట్లకి ఫైగా నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాధమిక అంచనా వేసింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి రూ.3వేల కోట్లు అందించాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి. సహాయక చర్యలు చేపట్టాలి.రోడ్ల మరమ్మత్తులు చేయాలి.
- కామిడి సతీష్ రెడ్డి,
జయశంకర్ భూపాలపల్లి జిల్లా.