Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక అదే క్యాడర్లో పదవీ విరమణ పొందుతున్నారు. విద్యాశాఖ పట్ల ఈ నిర్లక్యం సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలనెలా ఆ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ వారి సంక్షేమానికి కషి చేస్తున్నారు. నాలుగు నెలలలో పీఆర్సీ ఇస్తామని చెప్పిన సీఎం హామీ ముప్పయి నెలలు అయినా అమలు కాలేదు. గత ఏడేండ్ల నుంచి పదోన్నతులు పొందడానికి అన్ని అర్హతలు ఉండి కూడా ఉపాధ్యాయులు తీవ్రంగా నష్ట పోతున్నారు. అంతర్ జిల్లా బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యామంత్రి స్పందించి తక్షణమే ఉపాద్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ని ప్రకటించాలని కోరుతున్నారు. ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్రంలో వారి సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వారి సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం శోచనీయం.
- చర్లపల్లి వెంకటేశ్వర్లు,
మొగుళ్లపల్లి.