Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఉద్యమం ప్రపంచానికి వెలుగురేఖను ప్రసరింపచేస్తుండగా, కేంద్రంలోని బీజేపీ సర్కారుకు చెమటలు పట్టిస్తున్నది. రోజురోజుకూ పోరాటం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వానికి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా పరిస్థితి తయారైంది. ఏం చేయాలో పాలుపోక నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే తరహాలో వ్యవహరిస్తున్నది. రైతు ఉద్యమంలో చిలిక తెచ్చేందుకు శతథా ప్రయత్నించడం, ఆ సంగతి ఆ నోటా ఈ నోటా దేశమంతా పాకుతూ రైతుల్లో మరింత ఐక్యత పెరగడం మోడీ, షాల ద్వయానికి మింగుడు పడటం లేదు. అనవసర విమర్శలు చేస్తూ రైతుల ఐక్యతను దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో నిద్రలేని రాత్రులు తప్పట్లేదట పాపం ! చివరకు సుప్రీంకోర్టును అడ్డంపెట్టుకుని రైతులతో ఆటాడితే, ఢిల్లీని నాగండ్లతో దున్నే పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం విశేషం. కిం..కర్తవ్యం...పాపం !!
- బి.బసవపున్నయ్య