Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలండర్లోని 2020సంవత్సరం మరి కొద్ది గంటల్లో చరిత్రలో కలువనున్నది. విశ్వవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఎన్నో ముఖ్య ఘటనలు జరిగినా కరోనా సృష్టించిన కల్లోలం ముందు అవన్నీ చిన్న విషయాలుగానే మిగిలాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అనూహ్య విజయం, ఆస్ట్రేలియా కార్చిచ్చులో 47 మిలియన్ ఎకరాలు బూడిద కావడం, బ్రిటిష్ రాయల్ కుటుంబాన్ని ప్రిన్స్ హారీ, మేఘన మార్కెల్ వదిలి వెళ్ళడం, డొనాల్డ్ ట్రంప్ అభిసంశణ విచారణ ఎదుర్కోవడం, పారాసైట్ సినిమా ఆస్కార్ ఆవార్డు పొందడం, అమెరికాలో వర్ణవివక్షతో జార్జ్ ఫ్లాయిడ్ పోలీస్ హత్య ఉదంతం, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మరణ పుకారు, కరోనా టీకాల అభివృద్ధి లాంటి అనేక ముఖ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. మన ఇండియాలో 2020 ప్రధాన అంశాలుగా ప్రధమ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా జనరల్ బిపిన్ రావత్ నియామకం, ప్రపంచంలోనే 2వ అతి ఎత్తైన సర్దార్ వల్లబ్బారు పటేల్ విగ్రహాన్ని అలహాబాద్లో ఆవిష్కరించడం, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ విజయం, పలు అనుమానాలు, అసంతృప్తుల మధ్య అయోధ్యలో రామ జన్మభూమి వివాదానికి సుప్రీం కోర్టు తెరదించడం, ఆలస్యమే లేకుండా ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరగడం, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయిన తీరున నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు, టి20 ప్రపంచ కప్ నిర్వహణ, విశాఖ విషవాయు దుర్ఘటన, ప్రజా వ్యతిరేకమైన సీఏఏ, వ్యవసాయ బిల్లులు ఆమోదించడం, విద్యారంగాన్ని మరింత వ్యాపారమయం చేస్తూ నూతన విద్యా విధానం-2020 తీసుకురావడం, డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన, ఇండో చైనా సరిహద్దు వివాదంలో సైనికుల మరణం, అనేక చైనీస్ యాప్ల నిషేధం, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికిల్ తొలగించడం, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు లాంటివి మన కండ్ల ముందే జరిగాయి. వీటన్నింటినీ కాదని కరోనా కమ్మిన కారు చీకట్లు విశ్వ మానావాళిని అతలాకుతలం చేసాయి.
డిసెంబర్ 2019 మాసంలో చైనాదేశపు వూహాన్ నగరంలో కరోనా వైరస్ సోకడం ప్రారంభమైంది. కోవిడ్-19 (కరోనా వైరస్ డిసీజ్-2019)గా నామకరణం చేసిన ఈ ప్రమాదకర వైరస్ అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాపించి, కోట్ల మందికి సోకి వ్యాధి బారిన పడేయడమే కాకుండా మిలియన్ల కొద్ది ప్రాణాలను మింగేసింది. చైనా ప్రభుత్వం 31 డిసెంబర్ 2019న ఐరాసకు కరోనా వైరస్ ఉనికిని తెలియజేసింది. పలు విశ్లేషణల అనంతరం 12 జనవరి 2020న ఐరాస సంస్థ డబ్ల్యూహెచ్ఓ కరోనా వైరస్ను నిర్థారించింది. ఇండియాలో 30 జనవరి 2020న కేరళలో ప్రథమ కరోనా కేసు నమోదుకాగా, 12 మార్చి 2020న మొదటి కోవిడ్-19 కారణ మరణం నమోదైంది. కరోనా సోకిన వ్యక్తుల సంఖ్య దినదినం పెరుగుతూ సెప్టెంబర్, అక్టోబరు-2020 నాటికి తీవ్రరూపం దాల్చింది. నేటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8కోట్ల కరోనా కేసులు, దాదాపు 18 లక్షల మరణాలు నమోదు కావడం విచారకరం. ఇండియాలో కోటి కేసులు దాటగా, దాదాపు 1.5 లక్షల మరణాలు జరిగాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం అనాలోచితంగా, అశాస్త్రీయంగా విధించిన ''లాక్డౌన్'' కోట్లాదిమంది వలస కార్మికుల ఉసురు తీసుకుంది. అంతకు మించిన సంఖ్యలో ప్రజల ఉపాధిని దెబ్బతీసింది.
కరోనా వైరస్ విజంభనతో దేశవ్యాప్తంగా మిలియన్ల వలస దుఃఖాలు, లాక్డౌన్లతో ఉద్యోగ ఉపాధులు కోల్పోవడం, పేదలకు పని దొరక్కపోవడం, అన్ని రంగాల్లో ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోతలు, విద్యాలయాలు తెరవని కారణంగా లక్షల మంది ఉపాద్యాయులు, అధ్యాపకుల సేవలను తగ్గించడం, ఆన్లైన్ బోధనలతో విద్యార్థినీ విద్యార్థుల ఇక్కట్లు, ఉపాద్యాయుల సరికొత్త పాట్లు, సినీ పరిశ్రమ ఆగిపోవడం, క్రీడలకు సెలవులు, రవాణా వ్యవస్థ నిలిచి పోవడం లాంటి చేదు అనుభవాలను చూడాల్సిన దుస్థితి రావడం చాలా విచారకరం. శిశు నుంచి విశ్వవిద్యాలయ వరకు గత 8 మాసాలుగా తరగతులు తెరవక, ఆన్లైన్ తరగతులతో సంతప్తిపడక దిక్కు తోచని స్థితి ఇప్పటికీ ఉంది. ఇటీవల ప్రపంచాన్ని భయపెడుతున్న సరికొత్త కరోనా స్ట్రేయిన్ యూకేలో ప్రారంభం కావడంతో అన్ని దేశాలు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. కరోనా కల్లోలంతో ఆర్థికంగా అతి ఎక్కువ ప్రభావితమైన 15 దేశాల్లో భారత్ కూడా ఉన్నది. ఐరాస అంచనాల ప్రకారం భారత్కు 348 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం 29.9 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం కలిగిందని అంచనా వేసింది. నేటికీ కరోనా కమ్మిన చీకట్లు తొలగలేదు, ఎప్పుడు తొలుగుతాయో తెలియక దిక్కు తోచని స్థితిలో విశ్వమానవాళి ఉంది. ప్రతి ఒక్కరు సామాజిక దూరాలు, మాస్కుల ధారణలు, పోషకాహార అలవాట్లు జీవనశైలిలో భాగం చేసుకున్నారు. త్వరలోనే కరోనాను కట్టడి చేసే ధీటైన టీకా రావాలని, విశ్వ మానవాళి జీవితం పూర్వ స్థితికి చేరాలని మానసారా కోరుకుందాం.
- డా|| బి.మధు సూదన్ రెడ్డి
సెల్:9949700037