Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అరే...సామీ..ఏందిరాబై మీ లొల్లి. ఆడు ఔనంటే, ఈడు కాదంటాడు. ఈడు కాదంటే, ఆడు ఔనంటాడు. మధ్యలో ఎవడో వచ్చి ఆ రెండూ కాదు..ఇదే కరెక్టంటాడు'' బుర్ర గరమైతాంది. లొల్లి పీక్ స్టేజ్కు చేరుతాంది. గింతకీ దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా...అంటే అదేం లేదు. ఈ గోలంతా వాట్సప్తో వచ్చి పడింది. మోడీ-షా డైరెక్షన్లో ఏర్పాటైన భజనబృందం... వాళ్లేం చేసినా, ఆహా, ఓహౌ అంటూ నేరుగా నెట్టింట్లో కొచ్చి, వాట్సప్లో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు! వాట్సప్ ఆన్ చేయగానే వ్యవసాయ చట్టాలు 'న 'బూతో'..న భవిష్యత్' అంటూ చిడతల బ్యాచ్ పెడుతున్న పోస్టులు చికాకు తెప్పిస్తున్నాయి. ఎక్కడో ఎవడో ఆ పోస్టును సృష్టిస్తే, దాంట్లో నిజమెంతో నిర్థారించుకోకుండానే పక్క గ్రూపుల్లోకి 'నెట్టే'సే వాళ్ల లొల్లి ఎక్కువైంది. ఇదేందిరాబై, గిసుంటిరు పోస్ట్ చేయకు అంటే...ఆ ఏమైతదన్నా అంటూ దీర్ఘాలు తీయబడ్తిరి. కాశ్మీర్లో గతంలో ప్రజలే లేనట్టు, ఇప్పుడే అక్కడ కొత్తగా జనం పుట్టుకొచ్చినట్టు కాషాయమూకలు పెడుతున్న పోస్టులు చూస్తే, కంపరమెత్తుతోంది. తాజాగా, గ్యాస్ ధరలు పెంచడం వల్ల ముస్లింల ఆదాయం పెరిగి, ఆళ్లు సంతోషంగా ఉన్నారనీ, మోడీషా వివక్షలేని పాలన అందిస్తున్నారంటూ కేంద్ర ప్రాయోజిత వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తున్నది. ఫార్వర్డ్ పోస్టుల్ని పక్క గ్రూపుల్లోకి 'నెట్టే' ముందు కొంచెం సంయమనం పాటించి, వాస్తవాలు గమనించే ఓపిక నెటిజన్లకు లేకుండా పోతోంది. నిజం తెలిసినా 'వాట్సప్ ముందు హ్యాండ్సప్పే' తప్ప, వాదించే ఓపిక లేకుండా పోతోంది.
- కెఎన్ హరి