Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమకై తాము ఏమీ చేయం... అవసరమనుకుంటే ప్రజలు కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకోవాల్సిందే అన్నట్టుగా తయారైంది ప్రభుత్వం. చెత్త నిర్వహణ నుంచి పాడైన విద్యుత్ స్థంభాల వరకు ప్రతి విషయంలోనూ కోర్టు ఆదేశాలను జారీ చేస్తే తప్ప పనులు జరగని పరిస్థితి. చివరకు ఒక చిన్న కాలనీలో పాడైన విద్యుత్ స్థంభాన్ని తొలగించాలని స్థానికులు కోరితే అధికారులు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. గతంలో కరోనాకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని పదుల సంఖ్యలో పిటీషన్లు దాఖలు అయిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితి లో స్పందించే తత్వం ప్రభుత్వం కోల్పోయినట్టుగా మారింది. దీంతో ప్రతి అత్యవసర పరిస్థితిలో కోర్టు జోక్యం చేసుకొని మొట్టికాయలు వేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నది. ప్రభుత్వం స్పందించే ప్రభుత్వంగా మారాలని మేధావులు సూచిస్తున్నారు. అలాంటి మార్పు రావాలని ఆశిద్దాం.....
- కె.ప్రియకుమార్