Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ తాజాగా విడుదల చేసిన 'సులభతర జీవన సూచిక-2020 (ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020)', 'పురపాలక పనితీరు సూచిక-2020 (మునిసిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్-2020)' ప్రకారం దేశ ప్రముఖ పట్టణాలను వివిధ అంశాల ప్రాతిపదికన వర్గీకరించింది. దేశంలోని స్మార్ట్ సిటీలతో కలుపుకొని 111పట్టణాలలో చేపట్టిన శాస్త్రీయ విశ్లేషణలో 10లక్షలకన్నా అధిక జనాభా ఉన్న నగరాలు, 10లక్షల లోపు జనాభా ఉన్న నగరాలుగా విభజించి ర్యాంకుల వారీగా జాబితా తయారు చేశారు. దేశంలోని 111నగరాల్లో 32.2 లక్షల పట్టణవాసుల నుంచి అభిప్రాయాలు సేకరించి విశ్లేషణ చేశారు. భారత పట్టణవాసుల జీవన నాణ్యత ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం, సుస్థిరాభివద్ధి కేంద్రంగా 13విభాగాలకు చెందిన 49సూచికలు పరిగణలోకి తీసుకోబడినవి.
సులభతర జీవన సూచిక-2020
నగరాల్లో నెలకొన్న పరిశుభ్రత, పారిశుద్ధ్యం, భద్రత, సురక్షత, విద్య, వైద్యం, జీవన నాణ్యత, ఆర్థిక వనరులు, భవనాలు, గృహం, ఆవాసం, సురక్షిత నీరు, శక్తి వినియోగం, వ్యర్థాల నిర్వహణ, వినోదం, పర్యావరణం, హరిత ప్రాంతాలు, ఇంధన వినియోగం, సిటిజెన్ రెజిలియెన్స్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు నిర్ణయించారు. ఇండియాలోని 10లక్షల జనాభా దాటిన మహానగరాల్లో అత్యుత్తమ సులభతర జీవనశైలి కలిగిన నగరాల్లో ప్రథమ ర్యాంకును బెంగుళూరు దక్కించుకోగా, తరువాత పూనె, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై నగరాలు ముందు 10ర్యాంకులు పొందాయని కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణాభివద్ధి మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020' నివేదిక తెలియజేస్తున్నది. పదిలక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో ప్రథమ ర్యాంకును సిమ్లా దక్కించుకోగా భువనేశ్వర్, సిల్వస్సా, కాకినాడ, సేలమ్, వెల్లూర్, గాంధీనగర్, గుర్గామ్, దేవణగేరే, తిరుచురాపల్లిలు జాబితాలో టాప్ 10ర్యాంకుల్లో ఉన్నాయి. సులభతర జీవన సూచిక నిర్ణయించడానికి పౌరుల అవగాహన సర్వే (30శాతం వెయిటేజ్), జీవన నాణ్యత, సుస్థిరత, ఆర్థికవృద్ధి, 13విభిన్న అభివృద్ధి అంశాలు (70శాతం వెయిటేజ్) విశ్లేషించి ర్యాంకులను రూపొందించారు. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి గురువారం విడుదల చేసిన ర్యాంకుల్లో తెలుగు పట్టణాలు ర్వాంకుల సాధనలో వెనుకబడి ఉన్నాయని అర్థం అవుతున్నది. పదిలక్షలు దాటిన నగరాల్లో హైదరాబాద్కు 24వ, విజయవాడకు 41వ ర్యాంకు లభించాయి. పది లక్షల లోపు జనాభాగల నగరాల సులభతర జీవన సూచీలో తెలుగు రాష్ట్రాలలో కాకినాడకు 4వ ర్యాంకు, వరంగల్కు 19వ, కరీంనగర్కు 22వ, తిరుపతికి 46వ ర్యాంకు లభించాయి. దేశంలోని నగరాల మధ్య ఆరోగ్యకర పోటీతత్వం పెరిగి, ప్రజల సులభతర జీవన ప్రమాణాలను పెంచేకునేందుకు ఈ ర్యాంకులు ఉపయోగపడతాయని మంత్రిత్వ శాఖ బాధ్యులు తెలియజేశారు. ప్రజాభిప్రాయ సేకరణ విభాగంలో హైదరాబాద్కు 41వ, కరీంనగర్కు 22వ, వరంగల్కు 44వ ర్యాంకు లభించాయి.
పురపాలక పనితీరు సూచీలు
ఈ సంవత్సరం తొలిసారి పురపాలక పనితీరును కూడా మదింపు చేసి ఫలితాలను ర్యాంకుల వారీగా విడుదల చేశారు. పది లక్షల జనాభా దాటిన పురపాలక నగరాల్లో ఇండోర్, సూరత్, భోపాల్, పింప్రి చించ్వాడ్, పుణె, అహ్మదాబాద్, రారుపూర్, గ్రేటర్ ముంబై, విశాఖపట్నం, వడోదర తొలి 10ర్యాంకులతో నగర మునిసిపాలిటీలు పనితీరులో ముందున్నాయి. పదిలక్షల లోపు జనాభా కలిగిన నగరాల్లో మునిసిపల్ పనితీరు సూచిక-2020లో న్యూఢిల్లీ, తిరుపతి, గాంధీనగర్, కర్నాల్, సేలం, తిరుపూర్, బిలాస్పూర్, ఉదరుపూర్, ఝాన్సీ, తిరునల్వేలి నగరాలు ముందున్నాయని తేలింది. పెద్ద నగరాల పనితీరు జాబితాలో హైదరాబాద్కు 17వ, విజయవాడకు 27వ ర్యాంకు లభించాయి. పదిలక్షల లోపు నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల పట్టణాలు కాకినాడకు 11వ, వరంగల్కు 18వ, కరీంనగర్కు 21వ ర్యాంకులు దక్కాయి. పురపాలక సంస్థల పనితీరు మదింపునకు పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, మురుగు జలాలు, వ్యర్థాల నిర్వహణ, రిజిస్ట్రేషన్, అనుమతులు, ఆదాయ వనరులు, మౌలిక వసతులు, ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక వికేంద్రీకరణ, డిజిటల్ పాలన, డిజిటల్ లిటరసీ, ఎన్ఫోర్స్మెంట్, ప్రణాళికల రూపకల్పన, పారదర్శకత, జవాబుదారీతనం, మానవ వనరులు, సమర్థత, ప్రజా భాగస్వామ్యం లాంటి అంశాలు పరిగణలోకి తీసుకోబడినవి.
పట్టణాల్లోని వసతులు, పనితీరు, సౌకర్యాలు, వనరుల ఆధారంగా ప్రజల జీవన ప్రమాణాలు నిర్ణయించ బడతాయి. పట్టణాలలో సురక్షిత నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, విద్య, వైద్య సౌకర్యాలను ఒట్టి నగరవాసుల ఆరోగ్యం ఆధారపడుతుంది. మన నగరాలు శాంతియుత సహజీవనా నికి, సులభతర జీవన శైలికి, పురపాలక పనితీరుకు పర్యాయపదాలుగా మారాలని దేశవాసులు కోరుకుంటు న్నారు. నగరాల సుందరత, సరళత, స్వచ్ఛత లాంటి అంశాలు ప్రభుత్వ యంత్రాంగంపై మాత్రమే కాకుండా ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఆధారపడి ఉంటుంది.
(కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 'సులభతర జీవన సూచిక-2020, పురపాలక పనితీరు సూచిక-2020' ఆధారంగా)
- డా||బి.ఎం.రెడ్డి
సెల్:9949700037