Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూ పరిపాలన వ్యవస్థలో స్వతంత్రంగా రెవెన్యూ వ్యవస్థను ఏర్పరచిన నుంచి రెవెన్యూ సిబ్బంది, రాజకీయ భూ పెత్తందారులు రికార్డుల మార్పిడి, కబ్జాలతో భూ చట్టాలను వాళ్ళకు అనుగుణంగా మలుచుకుని భూ హక్కులు దాఖలు పరుచుకున్న అక్రమాల లీలలను ధరణీ పోర్టల్ పరిష్కరిస్తుందా? అవినీతి పరాకాష్టకు చేరిన పరిస్థితులున్న దృష్ట్యా రెవెన్యూ ప్రక్షాళనపై పట్టుదలతో ధరణి పోర్టల్ను చట్టం ద్వారా ప్రారంబించారు.
కానీ ధరణి పోర్టల్ కన్నా ముందే జరిగిన భూ మార్పిడి దస్తావేజులు, కుట్ర పూరిత స్వలాభ ఉద్దేశంతో జరిగిన మార్పులకు ధరణిలో పరిష్కరించే అవకాశాలు ఉండాలి. ధరణి పోర్టల్లో ఉన్న ఈ రికార్డులకు ప్రభుత్వ పీపీబీ పంపిణి ద్వారా టైటిల్ హక్కులను ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే విధంగా చట్టాల్లో అవకాశం కల్పించింది. ఈ భూ హక్కులకు నేపథ్యం 1954-55 కాస్రా ఆర్.ఒ.ఆర్., తదితర అంతర్లీనమైనటువంటి వాటిని రెవెన్యూ సిబ్బంది అవకాశం చేసుకుని చట్టాన్ని స్వలాభంతో భూహక్కుల మార్పిడి చేసి ఇచ్చినటువంటి పీపీబీకు టైటిల్ హక్కులను కల్పించడం సరియైన పద్ధతి కాదు. మోసం కుట్ర పూరితంగా పొందిన హక్కులకు చట్ట బద్ధత కల్పించడం నేర ప్రవృత్తిని ప్రోత్సహించడం, రైతాంగ లోకానికి అబద్రత, అనిశ్చితి, రక్షణ లేకుండా చేయడమే అవుతుంది.
నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో రెవెన్యూ డివిజన్ అధికారి రెవెజన్ కేసు ఆదేశాలలో ''డినోవా విచారణ జరిపి ఆర్డర్ను అమలు చెయగలరు'' ఈ రివిజన్ ఉత్తర్వులుపైన చట్టం నిర్ణయించిన సెక్షన్ ఆధారంగా సంయుక్త కలెక్టరు రివిజన్ ఫైల్ చేస్తే, వాస్తవిక చిరునామాలతోటి కేసులు ఫైల్ చేయమని ఉత్తర్వుల ద్వారా 2019 సంవత్సరంలో డిస్పోజల్ను చేసినాడు(సంయుక్త కలెక్టరు) దీనికి సంబందించిన దస్తావేజుల,రికార్డ్సు, ఆర్డరు కాపీలను పొందడానికి రెవెన్యూ డివిజన్ ఆఫీసులు దరఖాస్తు చేస్తే దానికి ఆర్.డి.ఒ. కార్యాలయం అధికారికంగా ఈ కేసుకు సంబందించిన విషయాలుగాని, ఆర్డర్లుగాని మా కార్యాలయానికి సంబందించినవికావు, కావున మా కార్యాలయంలో ఆర్డర్లు లేవు అని వింతైన ఆశ్చర్యకరమైన లేఖ అధికారికంగా జారీ చేసారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆర్.డి.ఒ. ఆదేశాలు దాదాపు వంద ఎకరాలకు సంబందించినవి. కాని రెండు రెవెన్యూ గ్రామాలలో పది ఎకరములు ఆర్.డి.ఒ. ఆదేశాల ప్రకారంగా మార్పులు చేర్పులు చేస్తున్నట్టు సంబందిత ఎల్లారెడ్డి తహసీల్దార్ ఆదేశాలు జారీ చేసి ఆ మార్పులు చేర్పులు 2016లో ఆర్.ఒ.ఆర్ యందు నమోదు చేసారు. కాని ఆ మార్పులు చేర్పుల ద్వారా రాయబడిన ఆర్.ఒ.ఆర్కు వ్యతిరేకంగా, కుట్రతో, మోసపూరితంగా పీపీబీలు జారీ చేసి ధరణి యందు నమోదైనది. ఆర్.ఒ.ఆర్. యందు నమోదు చేసిన వాటికి తహసీల్దారు కార్యాలయం నెం. ఆర్.ఒ.ఆర్ దస్తావేజు యందు నమోదు చేయబడినది, కాని ఆర్.డి.ఒ ఆర్డరు ద్వారా నమోదు చేయబడినటువంటి తహసీల్దారు కార్యాలయం కాపి మిస్సింగ్ అయినదని తెలియజేస్తున్నారు. రైతుబంధు సహాయం పొందడానికి అధికారులకు అవకాశం కల్పించినారు. ఇంకొక కేసులో కామారెడ్డి ఆర్డీఓ 50ఏండ్ల కింద జరిగిన డాక్యుమెంట్ గురించి మోసపూరితంగా జరిగిన పట్టా మార్పిడిని రద్దు చేస్తు ఏకపక్షంగా మోసపూరిత ఆర్డరు ఇచ్చినారు. నాగిరెడ్డిపేట తహసీల్ దారు వారసత్వ మార్పిడిలో కుటుంబ వారసులనే మార్చి ఆదేశాలు ఇచ్చిన్నాడు. ఎలారెడ్డి తహసీల్దారు ఏకంగా బ్రతికున్న మనిషికే సక్ సేషన్ ద్వారా ఏ మాత్రం కుటుంబానికి సంబంధం లేని వక్తికి మార్పిడి చేసిన్నాడు. ఒకే వ్యక్తికి రెండు పేర్ల ద్వారా పీపీబీ జారి చేసినారు. ఆధారం లేకుండా పేర్లు మార్చినారు. ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో వెలుగులోనికి రానివి కోకొల్లలు దానిలో ఇవి మచ్చుకు కొన్నే...! ఆశ్చర్యకరంగా అన్నీ ఒకే డివిజన్లో జరిగినవి. మరి ప్రభుత్వం ఇలాంటి వాటికి భూ హక్కులు కల్పిస్తే అమాయక రైతు తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలి? ధరణిలో పరిష్కారం ఉందా? అమాయక రైతుకు న్యాయం చేయడానికి సిబ్బంది పైన చర్య తీసుకోవడాని ఆస్కారం లేదా? ఇలాంటి భూ మార్పిడి యొక్క భూములకు చట్టబద్ధ హక్కులు ఎలాకల్పిస్తారు, వాటిని సరిదిద్దే అస్కారంలేదా! తెలంగాణా భూ హక్కుల, పట్టేదార్ పాసుబుక్ యాక్టు 2020 సెక్షన్ 14 (2) ప్రకారం తప్పుడు మోసపూరిత ఆదేశాలను జారీ చేసిన సంబందిత అధికారులను తగు దండన శిక్షలను కటినంగా అమలు చేసి తగు చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తక్షణమే పరిపాలన యంత్రాగాన్ని సన్నద్ధం చేసి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగకుండా కాపాడే ధర్మం అధికారుల, ప్రభుత్వం యొక్క నైతిక బాద్యత. సమాచార హక్కు చట్ట ప్రకారం దరఖాస్తు చేస్తే కోరిన సమాచారం మా కార్యాలయంలో లేదు అనే నిర్లక్షపు సమాధానం ఇస్తారు. ఒక్కొక్కసారి మా కార్యాలయంలో మీరు కోరిన సమాచారం లభ్యమైందని ఇస్తూ మళ్ళీ ఆదే కార్యాలయం ఆదే సమాచారం ఇవ్వమనగా మా కార్యాలయంలో లభ్యతలేదని ఎలాంటి సమాచారం లేకుండా పెండింగ్ పెడుతున్నారు. ఒక చట్టబద్దమైనటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఏ చట్టంకూడా ఏమి చేయలేదనే ధైర్యం రెవెన్యూ సిబ్బందికి ఏర్పడింది. ఆమాయక రైతులు, గత్యంతరం లేక భూ కష్టాలు ఎదుర్కొంటున్నారు. అభద్రతా భావంతో ఉన్నటివంటి రైతాంగానకి వారి అనుమానాలను తక్షణమే నివత్తి చేసి వారికి ధైర్యాన్నిచ్చే యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి. లేని పరిస్థితిలో ప్రజల్లో అశాంతి, అభద్రతతో సమాజంలో శాంతియుత జీవనవిధానం దెబ్బతిని అశాంతి సమాజం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే లోతైన అధ్యయనం చేసి వారికనువైన న్యాయ సహాయాన్ని ఏర్పాటు చేయటానికి సిబ్బందిని సమాయేతంచేయాలి.
- ఎం. అశోక్కుమార్