Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత మంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా సభలు, సమావేశాలకు ఎప్పుడూ ఆలస్యంగా వస్తారన్న విమర్శ వారిపై ఉంది. సభలకే కాదు శుభకార్యాలు, చావులకు కూడా ఇదే రకంగా ఆలస్యం చేస్తుంటారని ప్రజలు మాట్లాడుకుంటారు. కానీ విలేకరుల సమావేశాలకు కూడా లేట్గా రావడం, ఆ తర్వాత సారీ చెప్పడం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి అలవాటుగా మారిందని మీడియా మిత్రులు చర్చించుకుంటున్నారు. ఆయన ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా అరగంటకు పైగా ఆలస్యంగా వస్తారని గాంధీభవన్ మీడియా ఫిక్సయింది. మిలటరీ మేన్ అంటే ఉక్కు క్రమశిక్షణకు మారుపేరు. శిక్షణ పొంది ఉద్యోగ నిర్వహణలో కూడా అదే విధంగా క్రమశిక్షణ పాటించడంతోపాటు రిటైర్ అయిన తర్వాత కూడా అంతే క్రమశిక్షణ పాటిస్తారని విన్నాం. కానీ అలా జరగడం లేదు. గతంలో కాంగ్రెస్ నాయకులైన వైఎస్ రాజశేఖరరెడ్డి, డి శ్రీనివాస్, కె కేశవరావు, కె రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు కూడా మీడియా సమావేశాలకు కరెక్టు టైమ్ పాటించేవారని గాంధీభవన్వర్గాలు అంటున్నాయి. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఉత్తమ్ టైమ్ పాటించక పోవడంతో మీడియా ఒకింత అసహనం వ్యక్తం చేస్తోంది.
- గుడిగ రఘు