Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణమధ్య రైల్వేవారు వివిధ రైళ్ళలో పండగవేళల్లో జనరల్ కంపార్టుమెంట్లను పెంచవలసిన అవసరం ఎంతో ఉంది. రిజర్వేషన్ కంపార్టుమెంట్లు ముందే బుక్ అయి చాలా మంది జనరల్ కంపార్టుమెంట్లను ఎక్కడం, పేదవారు జనరల్ కంపార్లుమెంట్లనే నమ్ముకోవడం, తదితర కారణాలతో జనరల్ కంపార్టుమెంట్లు జనంతో కిక్కిరిసిపోతాయి. వృద్ధులు, పసిపిల్లలు, స్త్రీల బాధలు వర్ణనాతీతం. నిల్చోవడానికే స్థలం లేక టాయిలెట్లలోనూ జనం నిలబడుతున్నారు. ఇది ఎంతోమందికి ఇబ్బంది. స్టేజి సమీపిస్తున్నా ఆ జనంలో అడుగు ముందుకు కదలక దిగలేని పరిస్థితి. పండగ వేళల్లోనూ, రద్దీ సమయాలలోనూ జనరల్ కంపార్టుమెంట్లను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే అన్ని జనరల్ బోగీలలో ప్రత్యేకమైన రైళ్ళను నడపాలి.
సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్.