Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని జిల్లాలలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో బోర్లను విచ్చలవిడిగా వాడి బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గతంలో ఇచ్చిన 9 గంటల విద్యుత్ను వ్యవసాయ పనులకు అందించాలని రైతులు కోరుతున్నారు. నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించి సకాలంలో నిర్దిష్టమైన టైమ్లో కోతలు లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తే సరిపోతుందని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో చాలా మంది రైతులు ఇరవైనాలుగు గంటల విద్యుత్ను కోరారు. వృధా మూలంగా నిర్ణీత గంటలు ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల అభ్యర్థన మన్నించి రైతులందరినీ తెలుసుకొని ఆ జిల్లాలలో అలాగే సరఫరా చేయాలని అభ్యర్థి స్తున్నారు. ఇది రైతులు తీసుకున్న మంచి నిర్ణయంగా అభివర్ణించవచ్చు. ఇరవైనాలుగు గంటలు కరెంట్ కోరే వివిధ రైతులకు అదే విధంగా ఇవ్వండి. ఎవరు వద్దనుకుంటున్నారో వారికి మాత్రం 9 గంటలు ఇవ్వండి.
- అయినం రఘురామారావు, ఖమ్మం.