Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవుడు తొలిసారిగా ప్రాచీన కాలం నుండి భూమిపై జీవనం కొనసాగిస్తున్నప్పటినుండీ సొంతగూడులో జరుగుతున్న ఆహారాన్వేషణ కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురీత కావచ్చు. ఏదైనా ఆధిపత్య పాలకులకు వ్యతిరేకంగా తమ గోడు వ్యక్తం చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే లౌకిక రాజ్యం ఏర్పడిందో, ఇతర రాజుల ప్రభుత్వాలు ఏర్పడ్డాయో అప్పుడే ప్రజల, ప్రభుత్వాల మధ్య అన్యాయ వారధి ఏర్పడింది. ప్రజలను బతికించుకోవాలి. కాబట్టి దాచేసిన ధాన్యాన్ని ప్రజలకు సరఫరా చేయాలి. అప్పుడే కదా ప్రజలు కాసింత ఆకలి దప్పికలు తీర్చుకుంటారు. కానిపక్షంలో ఏ రాజైనా, ప్రభుత్వాలైనా సింహాసనంపై నిలబడలేవు. అంటే నగదు బదిలీ అని కొత్త ప్రతిపాదనను కేసీఆర్ ప్రభుత్వం తెరమీదకు తెస్తోంది. దీనివలన లబ్దిదారులలో ఉన్న వృద్ధులు, మహిళలు, అనారోగ్యులు, వికలాంగులు, రోడ్డు, రవాణాకు భయపడే పేదలు అనాగరికులు ఆ సరుకులను మోసుకొచ్చే శక్తి ఉండదు. ఇంట్లో ఎలుకలున్నాయని రైతులు ధాన్యాన్ని ఎలా అయితే బయట పడేయరో, కొంతశాతంలో ఉన్న డీలర్లు సరుకులను అమ్ముకుంటున్నారని పేద లబ్దిదారుల పొట్ట కొట్టడం మంచిది కాదు. రేషన్బియ్యం సరఫరా కొనసాగించాలి. ఇంకా మెరుగైన పద్ధతి ద్వారా సులభంగా,తొందరగా పంచే ప్రయత్నాలు చేయాలి.
చుంచు దేవకుమార్ కొమురవెళ్లి, సిద్ధిపేట,