Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్లకు సంబంధించిన సినిమాలకు నందుల అవార్డులను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదో తమకు అనుకూలంగా ఉన్న కొన్ని సినిమాలను, హీరోలను ఉత్తమమైనవిగా ప్రకటించి, పెద్దోళ్ల మెప్పు పొందేందుకు ప్రయత్నించింది. ఇది ఇలా కొన్నేండ్లుగా నడుస్తూనే ఉంది. అయినా నంది అవార్డులు వచ్చిన సినిమాలపై గానీ, హీరోలపైనా సంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు చాలా తక్కువ. అసంతృప్తులు ఎక్కువే. కాకపోతే ఈ వివాదం ఈసారి ఎక్కువైంది. ఒకరిద్దరు నిర్మాతలు, సినిమా సమీక్షలు చేసే వారు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఏడాది అవార్డులు అంటే అంతగా పట్టించుకునేవారు కాదేమో. మూడేండ్లు అవార్డులు కావడంతో అదీ ఒకే సామాజికవర్గానికి చెందిన హీరోలను, సినిమాలను ఉత్తమమైనవి అని చెప్పడంతో మరింత చర్చనీయాంశమైంది. ఈ సీన్ ఎలక్ట్రానిక్ చానల్స్కు మాత్రం పండుగలా మారింది. ఈ అవార్డులను వ్యతిరేకించిన వారిని పిలిపించుకుని రెండురోజుల పాటు కార్యక్రమాలు చేపట్టి సందడి చేశారు. ఇంకోవైపు కొంతమంది ట్విట్టర్లోనూ అభిప్రాయాలు చెప్పుకున్నారు. తమపైనే విమర్శలు రావడంతో అవార్డు కమిటీ మెంబర్లు కూడా తిట్ల పురాణం అందుకున్నారు. ఇదిఛానళ్లకు కనులవిందుగా మారింది. అయితే అవార్డులు వచ్చిన వారూ, రాని వారు మాత్రం స్పందించలేదు. అయినా వారికివ్వలేదు. వీరికి రాలేదు అనే బదులు ఎవరు బాగా నటించింది. ఏయే సినిమాలు మంచివో సమీక్ష చేసి వాళ్లే అవార్డులు ప్రకటించవచ్చు కదా అని చర్చించిన సదరు చానెళ్లపై జర్నలిస్టు మిత్రులు వ్యంగాస్త్రాలు సంధించారు. పద్మావతి సినిమాపై బీజేపీ, దాని అనుకూల శక్తులు వివాదం సృష్టిస్తుంటే వాటిపై చర్చాగోష్టులు నిర్వహించేందుకు బహుశా చానళ్లకు సమయం లేదేమో..
- టి.సంజయ్కుమార్