Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవభారత నిర్మాత, శాంతిదూత, ఆలోచ నా విధానంలో చొరవ, తెగింపు చూపే ధైర్యశాలి, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆ యన 1889 నవంబర్ 14న జన్మించారు. జవ హర్ సాహసి, గొప్ప స్వాప్నికుడు, స్నేహశీలి, ప్ర జాస్వామ్య ప్రియుడు, గొప్ప దార్శనికుడు. తనకంటూ కొన్ని ఆలోచనలు కలిగి వాటిని అను సరించిన వారిలో ఒకడు. పిల్లల పట్ల ప్రేమ, వాత్సల్యం, కరుణ చూపడంలో అగ్రగణ్యుడు. అందుకే అతని పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. అతను చూపిన రాజనీతి, విదేశీవిధానం, అలినోద్యమ కృషి శాంతి దూతగా నిలిపింది. నెహ్రూ ఒక పరిపాలనావేత్త, స్వాతంత్య్ర సమర యోధుడే గాక ఆర్థిక నిపుణుడు. అందుకే యూరప్లో కమ్యూనిస్టులు, క్యాపిటలిస్టులు, సోషలిస్టుల పరిచయాలతో భారత ఆర్థిక విధానంలో సహకార విధానం ప్రవేశ పెట్టడం జరిగింది. అందుకే నవంబర్ 14 నుండి 21 వరకు వారం రోజులపాటు ఆయన స్మృతికి గుర్తుగా మనదే శంలో సహకార వారోత్సవాలు జరుపుకుంటారు. నెహ్రూలో ఎంతటి దార్శనికుడు ఉన్నాడో అంతటి హేతువాది కూడా ఉన్నాడు. ఆయన ఓ గొప్ప హేతువాది. శాస్త్రీయ విజ్ఞానం ఉండాలని కాంక్షించేవాడు. ప్రతి విషయాన్ని తర్కించి ఆలోచించేవాడు. మతం మత్తు వంటిదనేవాడు. మతాన్ని రాజకీయాలతో మిళితం చేస్తే ఆలోచనా శక్తి తగ్గి స్వతంత్య్రం గా ఆలోచించలేని స్థితిలోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించాడు. ''మత విధానాలు, సిద్ధాంతాలు నాకు సరిపడవు. మతపరమైన ఆలోచనల వల్ల మానసిక అంతర్మదనం నుండి బయటపడగలమని నేను అనుకో వడం లేదు. దాని వల్ల కొంత ఉపశమనం కలగవచ్చు అయితే అది ఎంత మాత్రం సరిపోదని'' తన సోదరికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. పై ఆలోచనా విధానాలు చిన్నతనం నుండి నెహ్రూకు ఉండేవి. ముఖ్యం గా తండ్రి మోతిలాల్ నెహ్రూ ప్రభావం ఆయనపై ఉండేది. మతం విషయంలో తన ఉద్యమ మిత్రులతో వాదాలు జరుగుతుండేవి. మతం విషయంలో గాంధీతో కూడా విభేదించేడివాడు. సర్వశక్తివంతుడు అనే మరో విషయం గురించి తరచూ మహ్మద్ ఆలీతో వాధించేవాడు. దీంతో నెహ్రూను మతహీనుడు అనేవారు. కానీ ముక్కు సూటిగా పోయే వారితో ఎక్కువగా తర్కించటం, శాస్త్రరీతిన చర్చించటం అంత సులభం కాదని ఎక్కువగా తర్కించేడివాడు. కానీ తను మాత్రం తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించేవాడు. అందుకే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అనేవాడు. ప్రారంభోత్సవాలకు కొబ్బరికాయలు కొట్టడం నెహ్రూకు ఇష్టం ఉండేది కాదు. నెహ్రూ తన లేఖలలో, ఉపన్యాసాలలో ఎక్కువగా సాంకేతిక, శాస్త్రీయ, చారిత్రక విషయాలను ప్రస్తావించేవా డు. మతం స్థిర ప్రయత్నాలకు, నిర్మల భావాలకు శత్రువు, ఇది ఉద్రేకం మీద, రాగం మీద ఆధారపడుతుంది. దేవుని గురించి నెహ్రు ఆలోచన ఈ కింద విధంగా ఉండేది. ''మర్మమైనది నాకు తెలియదు. నేను దేవుడిని విశ్వ సించను. ఎందుకంటే నేను ఒక దేవుడి గురించిగానీ లేని అతీతశక్తుల గురించి గానీ ఆలోచించలేకపోతున్నాను అనేవాడు. శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాలనేది నెహ్రూ ముఖ్య ఆశయం. మానవుని ఆలోచనా విధానం శాస్త్రీయమై నిరూపితమైనదిగా ఉండాలనేది నెహ్రు ఆలోచన. ఇందుకు సైన్సు, టెక్నాలజీ ద్వారా పారి శ్రామికీకరణకు భారీ నిబద్ధతతో నూతన భారతదేశ నిర్మాణానికి కృషి చేశాడు. సైన్సు శక్తివంతమైన మార్పులు తెచ్చిపెట్టింది. సీఎస్ఐఆర్, డీఆర్డీఓ పరిశో ధనా ప్రయోగశాలలు, ఐఐటీల స్థాపనకు నెహ్రూ చేసిన కృషి ఎంతో అపారమైనది. భారత సైన్సు కాంగ్రెస్ వ్యవస్థా పకులలో నెహ్రు అగ్రగ ణ్యుడు. ప్రశ్న, ప్రశ్నించే హక్కు, విచారణ, అంగీకారస్ఫూర్తి శాస్త్రీయ కోణంలో ప్రాథమికమైనది. మానవీయ శాస్త్రవేత్తగా పునర్జన్మ మీద నమ్మకం లేనివాడు. అందుకే తన మరణాంతరం ఎటువంటి మతపర మైన కార్యక్రమాలు చేయవద్దని, ఎటువంటి ఆర్భాటాలు, మత క్రతువు లు నిర్వహించరాదని తన విల్లు ద్వారా పేర్కొన్నాడు. నూతన సాంఘిక విలువలు, లౌకికవాదం, ఏకీకరణను ప్రోత్సహించడం, జీవితంలో స్వీ య నమ్మకమైన, హేతుబద్ధ దృక్పథాన్ని విస్తరించడానికి నెహ్రూ జీవితాన్ని మార్గనిర్దేశక ఆదర్శంగా తీసుకోవాలి.
సెల్ : 9985438002