Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అగ్నిధార'' '' రుద్రవీణ'' కావ్యాల ద్వారా తెలుగు సాహితీ జగత్తులో నూతన శకాన్ని స్థాపించిన మహాకవి దాశరథి. వ రంగల్ జిల్లా చినగూడురు గ్రామంలో 1925 జూలై 22వ తేదీన వెంకటమ్మ, వెంకటాచార్యుల దంపతులకు జన్మించిన దాశరథి కృష్ణమార్చులు ఖమ్మంలోనే మెట్రి క్యులేషన్ వరకు చదువుకున్నాడు. బోపా ల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడి యట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్ సాహిత్యం ముఖ్య విష యంగా బీఏ పట్టా పొందారు. తెలంగా ణలో నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాల్గొని, జైలుకు వెళ్లి తన కవిత్వం ద్వారా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన అ భ్యుదయ కవి దాశరథి. పదేండ్ల వయస్సులోనే కవితలు రాయ డం ప్రారంభించి, తన ప్రతిభతో ఆచార్యులను, తోటి మిత్రులను అబ్బురపర్చాడు. విశ్వనాథ సత్యనారాయణ లాంటి మహాకవియే ''పిట్ట కొంచెం, కూత ఘనం'' అని దాశరథిని మెచ్చుకున్నారంటే ఆయన ప్రతిభ ఎంతటి అసాధారణమైందో చెప్పనవసరం లేదు. పద్యం, గేయం, వచన కవిత, గజల్, సినిమా పాట, వ్యాసం, నవల, కథ, విమర్శ, వ్యాఖ్యానం ఇలా అన్ని ప్రక్రియల్లో రచనలు చేసి ఆధునిక తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. అం గారం, శృంగారం రంగరించి తెలుగుతల్లి మెడలో పూల దండగా సింగారించాడు. రైతుదే తె లంగాణము, ముసలినక్కకు రాచరి కంబు దక్కునే అంటూ క్రూర నిజాంపై సింహగర్జన చేశాడు. ఆవేశానికి అక్షరాన్ని జత చేసి ఉద్యమానికి ఊపిరిపోశాడు. ప్ర పంచ శాంతిని కాంక్షించాడు. కవితలు చదివి సభల్లో అగ్గి కురిపించేవాడు.
అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం
అనాధుడికి ఆగర్భ శ్రీనాధుడికి మధ్య
అంటూ సామాన్యమానవుడి పక్షాన నిలబడి మానవ కళ్యాణానికి దారివేసిన మహానీయుడు దాశరథి. పద్యాన్ని రసికజనైక వేధ్యంగా, గేయంగా శ్రావణ వేయంగా వచన కవితను ఎంతో రుచిగా రచించగల నేర్పు దాశరథి సొంతం. ఏ ప్రక్రియలోనైనా అలవోకగా రచన చేసి, అటు సాహితీ దిగ్గ జాలను, ఇటు సామాన్య జనానీకాన్ని మెప్పించాడు. శాంతి, మా నవత, సమభావం, సౌభ్రాతృత్వం ఆయన కవితల్లో అణువణు వునా దర్శనమిస్తాయి. అరాచకాలు, దోపిడీలు, అంతమవ్వాలనే కాంక్షతో దాశరథి రాసిన పద్యాలు, గేయాలు, సర్వమానవాళికి జీవనవేదాలు. 1949 సంవత్సరంలో 'అగ్నిధార'తో మొదలైన ఆయన కవితా ప్రస్థానం రుద్రవీణ, మహాంద్రోదయం, పునర్న వం, తిమిరంతో సమరం, కవితా పుష్పం, నవజగానికి వందనం, అమృతవల్లి, తెలుగుతల్లి, అమృతాభిషేకం, జ్వాలాలేఖిని, ధ్వజ మెత్తిన ప్రజ, గాలిబ్ గీతాలు, మహాబోధి వంటి 40 కవితా సం పుటాలుగా అది ప్రవర్థిల్లింది. కావ్య సాహిత్యమే కాదు సినిమా సాహిత్యాన్ని కూడా తెలుగు ప్రజలకు అందించి రసజ్ఞుల హృద యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. 1960లో ఆత్రే య దర్శకత్వం వహించిన 'వాగ్దానం' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన దాశరథి ఆణిముత్యాలాంటి గీతాలెన్నో రాసి, తెలుగు చలన చిత్రసీమను నందనవనం చేశాడు. 2000 కుపైగా చిత్ర గేయాల్ని వెండితెరపై వెలిగించిన దాశరథి తెలుగు చలన చిత్ర గీత రచయితలలో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ''ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ, గోదారి గట్టుంది, గట్టుమీద సెట్టుంది.... మదిలో వీణలు మ్రోగే... ఏ దివిలో విరిసిన పారిజాతమో... నన్ను వదిలి నీవు పోలేవులే.... ఎన్నెన్నో జన్మలబంధం నీది నాది.... నీవు రావు నిదుర రాదు నిలిచిపోయే ఈ రేయి.... నా కంటిపాపలో నిలిచిపోరా... మొదలైన నిషా వంటి ఉర్దూ పదాలకు తెలుగుదనాన్ని అద్దిన దాశరథి ఉర్దూ సంప్రదాయాన్ని తెలుగు చలన చిత్రసీమలో ప్రవే శపెట్టిన తొలి తెలుగు సినీ కవి. ఇంతటి మహాకవిని ఆంధ్ర విశ్వ విద్యాలయం ''కళా ప్రపూర్ణ'' బిరుదుతో సత్కరించింది. ఆంధ్ర, ఆగ్రా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో స త్కరించాయి. ఆయన రాసిన ''గాలిబ్ గీతాలు'' కవితా సంపుటికి 1965లో ఉత్తమ అనువాద అవార్డు లభించింది. ''కవితాపుష్ప కం'' ఖండ కావ్యానికి 1967లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1974లో ''తిమిరంలో సమరం'' కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగులో గజల్, రుబాయి ప్రక్రియలకు ఆద్యుడైన దాశరథి ఆ ప్రక్రియలపై సునిశి తంగా పరిశోధన చేసినందుకు గాను భారత ప్రభుత్వం సీనియ ర్ ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. బహదూర్ షా జఫర్ అవార్డు కూడా ఆయనని వరించింది. 1977లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ఆస్థానకవి పదవిని కూడా ఇచ్చి గౌరవించింది. తెలు గు భాషాభివృద్ధికి ఆయన ఎన్నో సాహిత్య కార్యక్రమాల్ని ఏర్పాటు చేశాడు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్ర సా రస్వతి పరిషత్తు ప్రధాన సలహాదారుగా, అధికార భాషా సంఘ సభ్యుడిగా ఎన్నో పదవులను అధిరోహించి తెలుగు సాహిత్యాభి వృద్ధికి విశేష కృషి చేశాడు. నా పేరు ప్రజాకవి, నా ఊరు ప్రజా వాటి'' అని పలికిన దాశరథి ప్రజాక్షేమాన్ని కోరాడు. ప్రజల సౌ భాగ్యాన్ని కాంక్షించి కవిత్వాన్ని రాశాడు. కవిత్వాన్ని, పాండిత్యాన్ని కలగలిపి ఔపోసన పట్టాడు. జాతికి గీతికపాడి జాతిలో చైతన్యా న్ని రగిలించి, దేశ భవిష్యత్తు మంగళదీపమై వెలగాలని ఆశించి, సాధించిన అభ్యుదయ కవి చక్రవర్తి దాశరథి. నిత్య చైతన్య కవితానిధిగా నిలిచిన మహాకవి దాశరథి. 1987 నవంబర్ 5న దివంగతుడైనప్పటికీ తన కవిత్వంతో కీర్తి శేషుడయ్యాడు.
సెల్ : 9493472197