Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడొస్తున్న కవిత్వాన్ని తీక్షణంగా పరిశీలిస్తే కొంత అధ్యయన లోపం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. శిల్పంలోనూ, అంశంలోనూ, రూపంలోనూ సమకాలీన సమాజ విశ్లేషణతో స్పందించే విధానంలోనూ, ఎవరి ధోరణి వారిదే. రచనా వ్యాసంగా సరదాగా కాకుండా నిబద్ధత, నిమగతతో సజన చేయవలసిన అవసరం, అగత్యం అనివార్యంగా వుంది ఇప్పటి పరిస్థితులను సరిగా బేరీజు వేసుకుంటే. భావ కవిత్వ దశనుండి అభ్యుదయ మార్గం పట్టిన దశలో వచ్చిన పరిణామ దశలను, ఆయా కవుల శైలి, సమాజం పట్ల వారి ధక్కోణాన్ని అవలోకనం చేయడంలో నేటి కవులు ఎందుకు విస్మరిస్తున్నారో తెలియదు. అప్పటి సాహిత్యంలోవున్న సాంద్రత, సూటితనం కొంత కొరవడినా మంచి కవితలు వస్తున్నాయనడంలో సందేహంలేదు కానీ ఇంకా రావలసివుంది. కవిత్వం ఎవరి ప్రయోజనలకు ఉపయోగపడుతున్నది, ఎవరి గురించి రాస్తున్నావు, సర్వజనీయత వున్నదా లేదా, ప్రజల పక్షమా, పాలకవర్గ బోయీలమా అనే ఊగిసలాట నుండి స్థిరమైన బాటలో రచనలు రావాలి. కులాధిక్యత , మతోన్మాదం, ఉగ్రవాదం చాపకింద నీరులా నరనరాల్లో జీర్ణించుకున్న తరం నుండి కవిత్వం బయటపడి సంకెళ్లను తెగకొట్టుకుని, ముందుకు వస్తున్న తరుణంలో ఇంకా కొంత వెనుకబాటుతనం వదిలించుకోవలసి వుందనేది అతిశయోక్తి కాదు. అనివార్యంగా గత కాలపు సామాజిక వైరుధ్యాలను పెంచి పోషించిన, ధర్మ శాస్త్రాల పేరనో, కొన్ని సూత్రాల పేరనో సంస్కతుల పేరనో, కల్పిత కావ్యాల ఝరిలోంచి, తడిలోంచి, పుక్కిటిపురాణాల కబంధ హస్తాల పరిష్వంగంలోంచి భాషని, పడికట్టు పదాలని విడిపించి, ఆ కల్మషాలను కడిగి, ఎండగట్టే విధంగాను, మూలాలతో సహా రూపుమాపే దిశగా ఆ భావాల వ్యాప్తిని సహేతుకంగా ఎదుర్కొనగలిగే సత్తా పొందేందుకు అధ్యయనం ఎంతో అవసరం. సహేతుకమైన రచనా పటిమ అలవడాలనేది నిర్వివాదాంశం. గురజాడ, త్రిపురనేని, కొడవటిగంటి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఉన్నవ, అడివి బాపిరాజు, జాషువా, గరిమెళ్ల, మంగిపూడి భరతశర్మ, కుసుమ ధర్మన్న, తాపి ధర్మారావు, రాహుల్ సాంకత్యాయన్ లాంటివారెందరో ఒక కొత్త బాట అందించారు. అలాగే రాజా రామ్మోహన్రారు, ఈశ్వరచంద్ర, విద్యాసాగర్, పెరియార్ రామస్వామి, సుబ్రహ్మణ్య భారతి వారి రచనలను ఔపోసాన పట్టడం ద్వారా సమాజంలో ఇంకా జడలు విప్పిగంతులేస్తూ అమాయక జనాలపై పడుతున్న మూఢ నమ్మకాలపై కవులు కలం ఆయుధంగా వాడాల్సిందే, కులాల మధ్య తుంపులాటలు కాకుండ, ఆధిపత్యకులాల అణిచివేతపై (చుండూరు, కంచికచర్ల, గంగవరం ఉదంతాలు) మననం చేసుకోవాలి. అన్యాయం, అత్యాచారం, పరువు హత్యలు ఎవరు చేసినా అక్కడ కవిత్వం నిలబడాలి, ఖండించాలి. క్షేత్ర పర్యటన ద్వారా బాధితులకు ఊరట కలిగించి మీ వెనుక మేమున్నామని భరోసా ఇవ్వగలగాలి. ఇప్పటికే కొన్ని సంఘటనలకు కవులు స్పందించారు. పర్యటనలు జరిపి ప్రజల పక్షం వహించారు. నిర్ద్వంధ్వంగా కవులు స్పందించాలి. ఒక సంఘటనలో అందరు సమైక్యంగా స్పందిస్తే, మరొక సంఘటనలో పాక్షిక స్పందన కవులకు తగదు. సంఘటననే ముఖ్యంగా తీసుకున్ని కవులు తీవ్రంగా స్పందించాలి, అక్కడ వర్గ ప్రయోజానాల కంటే బాధితుల పక్షమే ప్రధానం కావాలి. ఒకప్పటి భూస్వామ్య వ్యవస్థ తాలూకు అవశేషాలు అప్పుడప్పుడు పడగవిప్పుతున్న తరుణలో ఉపేక్షించకూడదు. గ్రామాల్లోను చేతి వత్తులవారిపై ఇంకా పెత్తనం కొనసాగుతోంది. అణిచివేత, అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు, జులుంలు పెచ్చరిల్లుతున్న సంఘటనలు రోజూ ఎక్కడో అక్కడ జారుతూనేవున్నాయి. పాలకవర్గాలు తమదైన తరహాలో స్పందిస్తున్నాయే తప్ప, న్యాయం జరగటంలేదు. అలాంటి సమయాల్లో కూడా కవులుగా స్పందించాల్సి వుంది.
''కవులేంచేస్తారంటే/ కలాలకు కళ్లిచ్చి, అక్షరాలకు ప్రాణమిచ్చి,/ సొంత గొంతుకనిచ్చి ఆవేశానికి ఆలోచననను దట్టించడమే'' కవులు చేసే పని, అంతే కాదు'' ఆచార సంప్రదాయాల పట్టు వస్త్రాల ముసుగులోని లొసుగులు తొలిగించి, జాతులనణగతొక్కే మంత్ర, తంత్ర కుతంత్రాలను మట్టుబెడతారు. స్వచ్ఛమైన నేత్రాలిచ్చి నిప్పులు కక్కే ధిక్కార స్వరమిచ్చి, కలాలను కలకాలమెగిరే నిత్యారుణ కేతనాలు చేస్తారు''.
కవులు కాలాన్ని, రాజ్యాన్ని, రాజకీయాలని శాసించే స్థాయిలో విజయం సాధించినా, అది ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పరిణామాలు ఉదాహరించుకుని సంబరపడటం మాని, ఆ పోరాట ఫలితం ఎలా ప్రతిబింబిస్తున్నదో కవులు గమనించకపోతే, కేవలం ఉద్యమ కవులుగా మిగులుతారేమో, రాజకీయ నాయకులకు ఉపయోగపడతారేమో. పాలకవర్గానికి జూ హుజూర్ అంటారేమో. ఆ ఆలోచన వుండకపోతే మనం ప్రజా ద్రోహులమే. ఎన్నో రచనలు, పాటలు పాడారు. అప్పటి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. కానీ ఒరిగిందేమిటి. అలాంటి వారిలో కొందరు మంది మాగధులయ్యారు. కొలువులు పొందారు. ధిక్కార స్వరం మౌనం వహించింది. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కూడా మునపటి పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఇంకా నిర్బంధాలు, అణిచివేతలు పెరిగాయి. అది గ్రహించకపోతే ఎలా. అన్ని రంగాలలోను అసంతప్తి నెలకొనివుంది. రైతుల నష్టపరిహార సమస్య, విద్యార్థుల విద్యా రుసుం ముదరాయించే సమస్య, నిత్యావసర వస్తువుల దుకాణాల సమస్య, రోజువారి కూలీల సమస్య వెక్కిరిస్తున్నా పట్టించుకోకుండా, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, ప్రజాధనం అనవసర హంగు ఆర్భాటాలకు పందేరం చేయటం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఒక అగాధం ఏర్పడబోతోంది. ప్రజావసరాలను పక్కకు తోసి, కార్పొరేట్ వ్యవస్థలకు ధారాదత్తం చేస్తుంటే నిమ్మకునీరెత్తినట్టు కవులు కలాలు దూయకపోతే, జనాలకు తెలిసేదెట్లా... మందిరాలలో కాక, జన సమూహంలో కవులు తమ గొంతుక వినిపించాలి. కొత్త వొరవడి సష్టించాలి. జనం దగ్గరకే వారి సమస్యలపై తమ కవిత్వం వినిపించాలి, పాటలు పాడి, వీధినాటకాల ద్వారా చైతన్యం కలిగించాలి. నూటికి ఎనభై శాతంగా వున్న జనసమూహానికి ప్రతినిధులుగా కవులుండాలి. వారిని సమీకరించడంలో కవులు ప్రధాన ప్రతిపక్ష భూమిక నిర్వహించాలి. ఎందుకంటే కవులే అనధికార శాసన కర్తలు కాబట్టి. ఆ దిశగా మన మాట, పాట, బాట ఎల్లప్పుడూ ప్రజల తరఫున సర్కారుపై ఎక్కుపెట్టిన బాణం కావాలి.
సర్కారు ఏదైన సాంస్కతిక విధానంతో ముందుకుపోతోందా లేక పలుకుబడిని పెంచుకో చూస్తోదా అనే కోణం పరిశీలించాలి. ''మా తాతలు నేతులు తాగారు, కానీ మా మూతులు గుడుంబా వాసన వేస్తున్నాయి'' అన్న చందంగా గాక సమరశీల ఉద్యమ ఘోష నిరంతరం వినిపించకపోతే సర్కారు ఆటలకు అడ్డు అదుపు వుండదని గ్రహించకపోతే ఎలా? మనం ప్రజల పక్షమే వహించాలి. లేకపోతే ప్రజా ద్రోహుల జాబితాలో చేరుతామనేది నిత్యం గుర్తెరిగి అప్రమత్తంగా వుండాలి. మనలో కొందరు కవులు, రచయితలు ఇవాళ కులాలుగా ప్రయాణం చేస్తూ కవితా సంకలనాలు వెలువరిస్తున్నారు. సంకలనాలను ఆహ్వానిద్దాం. సమూహాల పేరుతో కాక, సమిష్టి కవులు సమైక్య కషిగా మాత్రమే దానిని మార్పుచేదాం. విడిగా రచనలు చేస్తుంటే, విడగొట్టడం సర్కారుకు వెన్నతో పెట్టిన విద్యే అవుతుంది. అవకాశం మనమే ఇచ్చిన వాళ్లమవుతున్నామని తెలుసుకోకపోతే పోనుపోను మనలో మనకు వైరుధ్యాలు నెరపటం వారికి తేలిక. ఆ ధోరణిని వ్యతిరేకించాలి. మన సాహితీ ప్రయాణంలో ప్రధాన విరోధి ఎవరో వారిపై మన గళం విప్పటానికి సమైక్యం కాకపోతే, రానున్న ప్రమాదం నివారించడం కష్టమౌతుంది. మనందరిని బలహీనపరిచే ఎత్తుగడలు సర్కారు చేపడుతుంది. నూటికి ఎనభై పైగా వున్న ప్రజల వాణిని వినిపించడంలో మనం ఐక్యంగా లేకపోతే ఇలా? విశాల వేదికగా కవులందరు తమ గళాన్ని వినిపించాల్సిన అగత్యం ఇవాళ అనివార్యమని గ్రహించాలి. రాజ్యానికి వ్యతిరేకంగా కవుల గళం వినిపిస్తేనే కవిత్వానికి, ప్రజా కళలకు మనుగడ అనేది మరువకూడనిది. సర్కారు చేసిన వాగ్దానాలను అమలు జరిపించేలా ఒక పథకంద్వారా సమైక్య శంఖారావం కవిత్వం ద్వారా, ప్రజాకళల ద్వారా మనం వెలువరించాలి. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని కోరుకుందాం.
- కపిల రామ్కుమార్
సెల్ : 9849535033