Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహసం అనే నిప్పుల మీద కాలాన్ని ఫలంగా వండేందుకు నెత్తు టి ఊటేతో ఊపిరి తీసుకుంటుంది. కష్టాలనే సిరాగా నింపుకునే కలంగా మారి పీడితుడే అణ్వస్త్రంగా, కన్నీళ్ల కు కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. దోపిడీ దారుల గుండెల్లో అగ్నిని రగిల్చిన కవి అలిశెట్టి ప్రభాకర్. పూర్వపు కరీంనగర్ జిల్లా నేటి జగిత్యాల జిల్లాలోని జగిత్యాల ప్రభాకర్ జన్మస్థలం. 12-1-1954న జన్మించారు. చినరాజం, లక్ష్మి వీరి తల్లిదండ్రులు. అలిశెట్టి గారికి ఏడుగురు అక్క చెల్లెల్లు, ఇద్దరు అన్నదమ్ములు ఉ న్నారు. కరీంనగర్లో ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంటర్ విద్యను సిద్దిపేటలో చదివారు. అలిశెట్టి గారి తండ్రి తన చిన్నతనంలోనే మరణించడం వల్ల కుటుంబ పోషణ బా ధ్యతలు స్వీకరించాడు. తన ఆదర్శాలకు అనుగుణంగా ఒక పేదింటి అమ్మాయి అయిన భాగ్యంను వివాహం చేసుకు న్నాడు. మొదట చిత్రకారుడిగా పెన్సిల్తో బొమ్మలు గీసి తన జీవితాన్ని ప్రారంభించాడు. పత్రికలకు పండుగల, ప్రకృ తి దృశ్యాల, సినీ నటుల బొమ్మలను వేశాడు. తరువాత జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి అనే సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి అడుగుపెట్టారు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చయిన ఆయన మొదటి కవిత. జీవిక కోసం ఫొటోగ్రాఫర్గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. 1978వ సంవత్సరంలో జగి త్యాలలో ''జగిత్యాల జైత్రయాత్ర'' అనే పేరుతో పెత్తందారీ వ్యవస్థ మీద పేదోళ్లు జరుపుతున్న పోరుతో ప్రభాకర్లోని అక్షరసూరీడు కొత్త దిక్కున ఉదయించాడు. అందుకే జైత్రయాత్రలో ప్రజల ఉరకలెత్తే ఉత్సాహాన్ని చూసి తనలోని ఆవేశాన్ని ''ఎర్ర పావురాలు'' గా ఎగరవేశాడు. ఇది 1978లో వచ్చిన అలిశెటిట గారి మొదటి కవితా సంకలనం. అప్పటి నుంచి కవిగా ముందుకు సాగాడు. ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు. అల్ప అక్షరాలతోనే అనల్పార్థాలనిచ్చే నానీలను మినీ కవిత్వంతో తెలుగు సాహిత్యంలో అలజడి సృష్టించాడు.
చీకట్లో జడుసుకుంటే
ఒక చెట్టే నీ చుట్టూరా
అరణ్యమై భయపెడుతుంది
గుండెంటూ కలిగుంటే నీ వెంటే
అదే పెద్ద సైన్యంలా నిలుస్తుంది
అని అటాండు. 1981లో ''చురకలు'' అనే కవితా సంకలనంలో పీడితుల పక్షాన తన అక్షర బాణాన్ని సంధించాడు. వ్యంగ్యం, పదును విమర్శ, సామాజిక స్పృహలాంటివి అన్నీ కలిపి ఒక చురకలో చూపించాడు. ఇందులో ''అన్యాయానికి ఏకీలుకాకీలు విరగొట్టగల వాడే వకీలు'' అని న్యాయవాదులకు ఒక చురక అలాగే
వాడు ముందే వానపాము
వాడి ముడ్డెటో మూతెటో
అని రాజకీయ నాయకులకు ఒక చురక అంటించాడు. 1982లో తన భార్యాపిల్లలతో హైదరాబాద్కు మకాం మార్చాడు. అప్పుడు ఆయన సిటీలైఫ్ అనే కవితా సంకలనాన్ని రచించాడు. అందులో
నగారా మోగిందా
నయాగరా దుమికిందా
నాలుగు రోడ్ల కూడలిలో ఏమది?
అదే నగరారణ్య హోరు
నరుడి జీవన ఘోష
తల్లి బడి వంటి పల్లె సీమల్నోదిలి
తరలి వచ్చిన పేద రైతులూ
ఇవపెట్టే లాంటి ఈ పట్టణాల్లో
ఊపిరాడని మీ బతుకులూ
సిటీ అంటే బ్యూటీ కాదు బిల్డింగ్లు కాదు
అటు భవంతులూ ఇటు పూరిండ్లు
దారిద్య్రం, సౌభాగ్యం సమాంతర రేఖలు!!
ఇది వెరైటీ మనుష్యుల సమస్యల
సమ్మేళన కోలాహలం
అని అలిశెట్టి చెప్పారు. ఇక సెక్స్ వర్కర్ల గరించి వారి దయనీయ స్థితి గురించి ప్రపంచానికి చాటాడు.
తనువు శవమై ఒకరికి వశమై
తనువు పుండై ఒకడికి పండై
ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిసై
అని వారి గురించి చెప్పాడు. ఇక అలిశెట్టి రాజకీయాలన్నా, నాయకులన్నా మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత. వారిని గురించి అలిశెట్టి
ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట
ఇంకెవర్నీ మోసగించననీ
ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట
తోటి జంతువుల్ని సంహరించనని
ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నారు
అని రాజకీయ నాయకుల తీరును తన కవితలో ఏకిపారేశాడు. 1985లో ఆయన రక్తరేఖ అనే కవితా సంకలనం విడుదల చేశాడు. ఆ కవితా చిత్రాలను చూసి ఎందరో ఎగబడి మరీ కొనుక్కున్నారు. 4వేల కాపీలు అమ్ముడుపోయి ఇప్పటికీ ఓ రికార్డుగా మిగిలిపోయింది. ఈ సమయంలోనే ఆయనను క్షయ వ్యాధి చుట్టుముట్టింది. అయినా ఆయన కవిత రాయడం ఆపలేదు. 1990లో సంక్షోభ గీతంలో దేశంలోని సంక్షోభాన్ని అద్భుతంగా చిత్రించాడు, చెప్పాడు. అందులో
పాలరాతి బొమ్మైనా
పార్లమెంట్ భవనమైనా
వాడు చుడితేనే శ్రీకారం
వాడు కడితేనే ఆకారం
అని శ్రామికుల్ని కీర్తించాడు. ఇంకా అలిశెల్టి ఇతర రచనలు 'మంటల జెండాలు' 'ఎన్నికల ఎండమావి' ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ఆరేండ్లుగా సీరియల్గా 'సిటీలైఫ్' పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందారు. ''మరణం నా చివరి చరణం కాదు'' అని ప్రభాకర్ తనని కబలించే మృత్యువును ముందే గుర్తించి ఒక వ్యక్తిగత కవితను రచించాడు. అది
''తెరవెనుక లీలగా మృత్యువు కదలాడినట్టు
తెరలు తెరలుగా దగ్గొస్తుంది..
తెగిన తీగను సవరించడానికన్నట్టు
గబగబా పరుగెత్తుకొచ్చి నా భాగ్యం
గ్లాసెడు నీళ్లిస్తుంద''ని రాసుకున్నాడు.
చివరి రోజుల్లో పేదరికంతో పోరాటం చేసే రోజుల్లోనూ ఆయన దారితప్పలేదు. ఆయన రాసిన కవితా సంకలనా లను సినిమాలకు అమ్ముకునే అవకాశం వచ్చినా ఆయన ఒప్పుకోలేదు. సినిమా కవిగా మారుంటే ఎంతో పేరు ప్రఖ్యా తులు వచ్చేవి. కానీ సమాజం కోసం రాస్తాననే మాటకు కట్టుబడి ఉన్నారు. ఫలితంగా క్షయకు చికిత్స చేయించడా నికి డబ్బులు లేక 12.1.1993న హైదరాబాద్లో కన్నుమూ శారు. మృత్యువు దాడి చేసిన రోజు కూడా అక్షరాలకు జీవం పోశాడు. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం, ఫొటోగ్రఫీ వంటి రంగాల్లో అసమాన ప్రతిభను కనబరిచిన సృజనశీలి. జీవిక కోసం తప్ప సంపాదన కోసం ఆరాటపడని గొప్ప వ్యక్తి. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి. పీడితుల కోసం వారికి అండగా నిలిచి వారి గుండెల్లో స్థానం కలిగిన మహాకవి అలిశెట్టి. 40 ఏండ్ల స్వల్ప వయసులోనే ఆయన కన్నుమూశారు. అందుకే ఆయనను కడసారిగా చూసేందుకు సగం హైదరాబాద్ ప్రభాకర్ ఇంటిముందు నిలిచారు. ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.
- ఉషాశ్రీ తాల్క
సెల్ : 9949914485