Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో ప్రజాస్వామ్యం మన దేశ మట్టిని తొలుచుకుని మొలకెత్తలేదని నియం తత్వమే తమ నైజమని టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ప్రజాస్వామ్యం మ న దేశపు భూస్వామ్యపు మట్టిలో పైనుండి నా టు వేయబడినది మాత్రమే. మన ప్రజాస్వా మ్యం మన దేశ నియంతత్వపు కంపు కొంపకు వేసిన పైసున్నం మాత్రమే. ఇప్పుడు మన దేశం లోనైనా, తెలంగాణ రాష్ట్రంలోనైనా అన్నింటికం టే అత్యవసరంగా మారిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి ప్రజాస్వా మిక హక్కులే. ప్రజాస్వామిక హక్కులు లేకుండా ఎవరూ తమ న్యాయ బద్దమైన ఏ ప్రయోజనాలను సాధించుకోలేరు. ఎవరు ప్రశ్నిం చినా విమర్శించినా వారి పైన అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రయోగించి వేధిస్తు న్నారు. అరెస్టులు చేయిస్తున్నారు. తప్పుడు కేసులు బనాయి స్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, ప్రతిప క్షాలను లేకుండా చేయడానికి కావలసినంత కషి చేసిం ది. టీఆర్ఎస్ మొదటి నుండి జేఏసీ అంటే ఎక్కువ భయపడుతూ వస్తు న్నది. తెలం గాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన జేఏసీ కి తెలంగాణ ప్రజల హదయాలలో బలమైన స్థానం ఉంది. అందుకే జేఏసీ అస్తిత్వాన్నే అంతం చేయడానికి టీఆర్ఎస్ ఎన్నో కుతంత్రాలకు పాల్పడింది. తమ అంతేవాసులతో రాజీనామాల డ్రామాలు ఆడించి, జేఏసీ అంతమైం దంటూ ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఇక జేఏసీ అవసరం లేదంటూ అవకాశవాద సిద్ధాంతాలు వల్లించారు. ఎన్ని కుట్రలు చేసినా జేఏసీ అంతం కాలేదు. టీఆర్ఎస్ ప్ర భుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు అర్థమవుతున్న కొద్దీ, తెలం గాణ ప్రజలలో జేఏసీ పోరాట పిలుపులకు మద్దతు పెరుగుతూ వస్తున్న ది. ఈ క్రమం లోనే జేఏసీ పైన టీఆర్ఎస్ ప్రభుత్వపు నిర్బంధం, కక్షసా ధింపు చర్యలు పెరుగుతూ వస్తున్నాయి. మల్లన్న సాగర్ మొదలు అన్ని ప్రాజెక్టులలోని అసంబద్దతను ప్రశ్నిస్తే, ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా, జేఏసీ రైతులకు సాగునీరు ఇవ్వకుండా అడ్డుపడుతున్నదని అబద్దాలు ప్రచారం చేశారు. మిషన్ భగీరథ ఖర్చు అంచనాలను ప్రశ్నిస్తే, తాగునీరు ఇవ్వకుండా అ డ్డుకుంటున్నారని ప్రచారం చేశారు. చత్తీస్గడ్ ప్రభుత్వంతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు ఉన్నాయనీ, తెలంగా ణకు నష్టమని ఎత్తి చూపినందుకు విద్యుత్రంగ జేఏసీ నాయకులపైన కక్షసాధింపు చర్యలకు దిగింది టీఆర్ఎస్ ప్రభు త్వం. జేఏసీ ఏ కార్య క్రమం తలపెట్టినా, రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు లను తుంగలో తొక్కు తూ అనుమతిని నిరాకరిస్తున్నది. తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్రల కు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంకులు కల్పించింది. అరెస్టులు చేసింది. తెలంగాణ విద్యావంతుల వేదిక మహా సభలకు కూడా ఆటం కాలు కల్పించింది. తెలంగాణలో ఏ ప్రజాసంఘం కూడా స్వేచ్ఛగా సభ లు, సమావేశాలు జరుపుకోలేని పరిస్థితులను టీ ఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించింది. చివరికి కుటుంబ సభ్యులు చనిపో యినా తమ కుటుంబ స భ్యున్ని స్మరించుకోలేని పరిస్థితి దాపురించింది. డిసెంబర్ 4న నిరు ద్యోగుల సమస్యలపై జేఏసీ తలపెట్టిన కొలువుల కొట్లాట సభకు టీఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డంకులు కల్పించి హక్కులు కాలరాసివేతలో అగ్ర స్థా నానికి చేరుకున్నది. నిరుద్యోగుల సమస్యలపై సభ పెట్టుకుంటామని అనుమతి కోసం జేఏసీ నాయకులు 2017 ఫిబ్రవరి నుండి తిరిగినా అనుమతి ఇవ్వలేదు. చివరికి హైకోర్టుకు వెళ్తే డిసెంబర్ 4 సభ జరుపు కోవడానికి అనుమతి లభించింది. ఒక శాంతి యుత సభకు అనుమతి లభించడానికి పది నెలల కాలం పట్టిందంటే తెలంగాణలో ప్రజాస్వా మ్యం పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కాలాన్ని లాగదీయడం ద్వారా నిరుద్యోగులలో ఇక ఏమి చేయలేమనే ని రాశ కలిగించి ఉద్యమించ కుండా చేయాలని చూసింది టీఆర్ఎస్ ప్రభు త్వం. కానీ జేఏసీ పట్టు వదలకుండా చట్టబద్దంగా కోర్టు ద్వారా అనుమ తి సాధించింది. అయితేనేం నియంతల పాలనలో చట్టబద్ద పాలన, చ ట్టాలు అన్నింటిని చెత్త బుట్టలోకి సులువుగా నెట్టేయవచ్చని, కోర్టు ఆ దేశాలు ఏమి పని చేయవని టీఆర్ఎస్ ప్రభుత్వం నిరూపించింది. తెలం గాణ జిల్లాల నుండి పెద్ద ఎత్తున సభకు వస్తున్న ప్రజలను హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు అరెస్టు చేశారు. ముందు సభ జరుపుకోకుండా అన్ని అడ్డంకులు కల్పించారు. మళ్లీ వారే జంకుబొంకు లేకుండా సభ విఫలమైందంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇక టీఆర్ ఎస్కు బాకాలు ఊదే దమ్మున్న పత్రికలు, ఇంటి పత్రికలు, ప్రజల స్పంద న లేదంటూ, ఫ్లాప్ అంటూ గోబెల్స్ ప్రచారం చేశాయి. కానీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడం నేరమని మాత్రం వీరికి గుర్తుకు రాలేదు. సభకు ముందు, తరువాత కూడా అధికార పార్టీ తన ప్రజాస్వా మిక వ్యతిరేక నైజాన్ని బయట పెట్టుకుంది. ఆశ్చర్యం ఏమిటంటే, టీఆర్ఎస్ 2014 నాటి తన ఎన్నికల ప్రణాళికలో ప్రజాస్వామ్యం, ప్రజా స్వామిక పాలన గురించి గొప్పగా చెప్పుకున్నది. ''హింసకు తావులేకుం డా, ప్రజాస్వామిక పద్ధతుల్లో తమ తమ భావజాలాన్ని ప్రచారం చేసు కునే స్వేచ్ఛను గౌరవిస్తుంది. రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను కాపాడడం ప్రజాస్వామిక విలువల పునాది మీద పరిపాలన సాగించడం ప్రభుత్వ విధి. రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులను అధికార వ్యవ స్థతోపాటు ఎవరూ భంగం కలిగించే అవకాశం ఉండొద్దని టీఆర్ఎస్ భావిస్తోంది. భావప్రకటన స్వేచ్ఛ, రాజకీయ విశ్వాసాలను కలిగిఉండే హక్కును గౌరవిస్తుంది'' (టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక పేజి 30). '' ప్రజాస్వామికమైన కార్య కలాపాలు ఎవరు చేపట్టినా వారికి ఎటువంటి అవరోధం లేని విధంగా వారి హక్కులు కాపాడే విధంగా పరిపాలన ఉంటుంది, ప్రజలు శాంతియుతంగా అహింసా మార్గంలో ఉద్యమించే హక్కు అమలయ్యే వాతావరణం నిర్మిస్తుంది'' (అదే పుస్తకం పేజి 31)
ఈ గొప్ప మహా వాక్యాలన్ని టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలోనివే. ఎన్నికల ప్రణాళికలో రాసిన విషయాలను టీఆర్ఎస్ నాయకత్వం అవస రం రీత్యానే మరిచిపోయింది. అందుకే ఎన్నికల ప్రణాళికలో పేర్కొనని మిషన్ భగీరథ పైన్నే కేంద్రీకరించింది. ఎన్నికల ప్రణాళికలో చెప్పనివి కూడా చేస్తున్నాము అంటే, చెప్పినవి చేయరని తెలంగాణ ప్రజలకు ముందు అర్థం కాలేదు. కానీ ఈ మూడున్నర సంవత్సరాల నిరంకుశ పాలన తరువాత ప్రజాస్వామ్యం గురించి చెప్పిన విషయాలు ఎందుకు అమలు కావడం లేదో, ఎవరి ప్రయోజనాలు అమలు కావడం లేదో అ ర్థం చేసుకుంటున్నారు. కలలుకన్న సుఖశాంతుల తెలంగాణ ఇంకా కలగానే మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఏర్పడింది. తెలంగాణ కష్టాలన్ని అలాగే వెక్కిరిస్తున్నాయి. పండించే రైతు ఇంకా ఉరికొయ్యకు వేలాడుతూనే ఉన్నాడు. వినియోగదారుడు మండిపోతున్న ధరల మీద మాడిపోతూనే ఉన్నాడు. నిరుద్యోగులు ఎండమావులలో పరుగులు తీస్తూనే ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు ఆశ నిరాశల మధ్య అంతం లేకుండా ఊగుతూనే ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్ నుండి వరంగల్ వరకు పారిశ్రా మిక కారిడార్, ప్రతి జిల్లాకేంద్రంలో నిమ్స్ స్థాయి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య లాంటి హామీలన్నీ అటక మీదనే కాపురం పెట్టాయి. సూర్యుడిలా ధగధగ మెరిసిపోతూ సమస్యల న్నింటినీ మార్చివేస్తూ , ప్రతి మూలకు వెలుతురు పంచుతూ తెలంగాణ ఉదయిస్తుంది అనుకుంటే, ఉదయంలోనే మాది ఇక ఉద్యమ పార్టీ కాదంటూ అవకాశవాద రాజకీయాలకు టీఆర్ఎస్ తెర లేపింది. తెలం గాణ వ్యతిరేకులందరినీ సాదరంగా ''రాజకీయ పార్టీ''లోకి ఆహ్వానించిం ది. ఇప్పుడు టీఆర్ఎస్లో వీరిదే ఆధిపత్యం. అసలు ఉద్యమంలో పాల్గొ న్న ఎందరో నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో అడుగున అనామ కులుగా మిగిలిపోయారు. ఉద్యమ పార్టీ నుండి అవకాశవాద పార్టీగా మారిన టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చే శక్తి లేకుండా పోయింది. కానీ టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజల ధిక్కార స్వభా వం గురించి బాగా తెలుసు. అందుకే తమ అభిప్రాయాలను వ్యక్తం చే యడానికి ప్రజలకు ఎటువంటి ప్రజాస్వామిక అవకాశం కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం. అయితే తెలంగాణ ప్రజలు రాచరిక నిజాం దగ్గరనుం డి అసెంబ్లీ రాజుల వరకు చాలా మందిని చూశారు. ప్రజాస్వామిక హక్కులు పునరిద్ధరించబడకపోతే అందరు రాజులకు చూపించిన స్థలాన్నే ఈ రాజులకూ చూపిస్తారు.
- లంక పాపిరెడ్డి