Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు రూ.100కోట్లు వ్యయమైందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు రూ.80కోట్ల ఖ ర్చు వివరాలు అందాయనీ, పూర్తిస్థాయి లెక్క లు అందితే మరో రూ.20కోట్లకు పెరుగుతుం దనీ అంచనా వేస్తున్నారు. ఈ మహాసభలకు ప్రభుత్వం కేటాయించింది మాత్రం రూ.50 కోట్లే. అయితే ఈ సభలు అంచనాలకు మించి నిర్వహించారు. సర్కారు ఊహించిన దానికంటే భాషాభిమానులు సాహి తీవేత్తలు, ఎన్ఆర్ఐలు ఎక్కువగా రావడం వల్లే ఖర్చు పెరిగిందని ప్రభు త్వాధికారులు అంటున్నారు. ఈ మహాసభలు జరిగి నెలరోజులవుతు న్నది. తెలుగు భాషాభివృద్ధిపై చర్చ జరిగి తీర్మానాలు చేయబడుతాయని తెలుగు ప్రజలు, భాష పండితులు, భాషాభిమానులు కొండంత ఆశ పెట్టుకున్నారు. గత 20 ఏండ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ స్కూ లు, కాలేజిల్లో తెలుగు బోధన ప్రాధాన్యత రోజురోజుకూ దిగజారిపోతుం దని తెలిసినప్పటికీ, తెలుగు భాషాభివృద్ధికి ఇంతకాలం ఎలాంటి చర్య లు చేపట్టలేదు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి సుమారు నాలుగేండ్లు అవుతున్నా ఫలితం లేదు. ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికగా హై దరాబాద్ నగరంలో చారిత్రాత్మకంగా రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి సారి జరిగే ఈ మహాసభల్లో భాషాభివృద్ధికి న్యాయం జరుగుతుందని తెలుగు ప్రజలు కలలుగన్నారు. ఇతర రాష్ట్రాలలో వారి మాతృభాషనే అధికార భాషగా చేస్తే తెలంగాణలో ఆ పరిస్థితి కన్పించటం లేదు. మొ త్తంగా అందరి ఉపన్యాసాలు ''తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహి స్తున్నాం, బాగా జరుగుతున్నాయి'' అనే పద్ధతిలోనే సాగాయి. మహాస భలకు 42దేశాల ప్రతినిధులు హాజరైనట్టు చెబుతున్నమాట వాస్తవం కా వచ్చు. కానీ మహాసభలో తెలుగు భాషాభివృద్ధికి ఏ రకమైన చర్చ జరి గిందని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరముంది. సుమారు రూ.100 కోట్లు కేటాయించి జరిపిన మహాసభలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత తెలుగు ప్రజలకు భాష, యాస మరింత అభివృద్ధికి మహాసభలు ఉపయోగపడాలి. కానీ అలా జరగలేదు. సభలకు హాజరైన కవులు, రచయితలు, భాషాభిమానుల్లో ఉత్సాహం పెద్దగా కన్పించలేదు. భాషా పండితుల సమస్యలు వారంలో పరిష్కారం చేస్తామన్నారు. కానీ అదీ జరగలేదు. మాతృ భాషలోనే మొదటి నుండి ఇంటర్ వరకు తప్పకుండా తెలుగు చదవాలనీ, అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చె ప్పారు. అయితే ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు తెలుగు పండిట్స్ శిక్షణ పూర్తి చేసినవారున్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. మరో పక్క ప్రయివేటు, కొలువుల కోసం, కార్పొరేట్ స్కూల్స్, కాలేజిల్లో ఇంగ్లీష్ మీడియంలోనే చదువులు కొనసాగుతున్నాయి. మరోపక్క కార్పొరేట్ సంస్థలు ఇంగ్లీష్ విద్య పట్ల పెద్దఎత్తున ప్రచారం చేసి అందనంత ఎత్తుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ పరిస్థితుల్లో తెలుగును నమ్ముకొని చదివిన మధ్య తరగతి వారికి బయట కొలువులు దొరుకుతాయనే గ్యా రంటీ లేదు. ఇప్పటికే చాలా ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నట్టు పత్రికల్లో చూస్తున్నాం. అందువల్ల తల్లిదండ్రులు ఇంగ్లీష్ విద్యవైపు చూ స్తున్నది వాస్తవం. దీనికి కారణం పాలకులే. కాబట్టి తెలుగు భాషాభి వృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తీసుకురావాలి. భాషతోనే తెలుగు ప్రజల బతుకుదెరువు వుండేలా ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యోగం దొ రికే విధంగా నమ్మకం కలిగించాలి. ఇతర రాష్ట్రాల్లో మాతృ భాషకిచ్చిన ప్రాధాన్యతను తెలంగాణలోనూ ఇవ్వాలి. తెలుగు భాషపట్ల సంకుచిత భావం వీడాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, వచ్చి న తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కేజీ టు పీజీ ఉచిత విద్య, భాషాభివృధ్ధికి ప్రత్యేక బడ్జెట్, ఉపాధ్యాయుల నియామకాలు, తప్పని సరిగా తెలుగు బోధన మొదటి నుండి ఇంటర్ వరకు అమలయ్యేలా సృష్టమైన విధానాలు ప్రకటించాలి.
- గుమ్మడిరాజు నరేష్
సెల్ : 9491039520