Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పటార్లపైనున్న (ఆదిలాబాద్ అడవుల్లోని ఎత్తయిన కొండల గుట్టల మీద గోండులు నివాస ప్రాంతం) గోండుల జీవన సౌందర్యాన్ని, వారి సం స్కృతిని, వారి తండ్లాటని వారి భాషలో, యాసలోనే తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన సాహిత్యకా రుడు. మౌఖిక సాహిత్యంలో మరుగుపడి ఉన్న ఆది వాసీల ఆరాధ్యదైవం కుమ్రంభీం జీవితచరిత్రను అ ల్లం రాజయ్యతో కలిసి ప్రపంచానికి అందించిన పరి శోధకుడు. ఆయనే శనిగరం వెంకటేశ్వర్లు. అలియా స్ సాహు. హుస్నాబాద్ తాలుకా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్లో శనిగరం స్వామి, అ యోధ్య దంపతులకు 1955 అక్టోబర్ 2న శనిగరం వెంకటేశ్వర్లు జన్మించారు. ఉన్నత విద్యను హుజురా బాద్లో పూర్తిచేశాడు. డిగ్రీ విద్యనభ్యసించేందుకు జ మ్మికుంట ఆదర్శ కళాశాలకు వెళ్లాడు. విప్లవోద్యమం విస్తరణలో భాగంగా సహచరులు గజ్జెల గంగారం, నల్లా ఆదిరెడ్డితో కలిసి సాహు ఆదిలాబాద్ ప్రాంతా నికి వెళ్లాడు. అక్కడి గోండుల జీవన విధానాన్ని చాలా దగ్గరి నుంచి నిశితంగా అధ్యయనం చేశారు. గోండుల్లో ఒక్కడు అన్నంతగా వారితో మమేకమ య్యాడు. వారి భాషను నేర్చుకోవడమేగాక ఆ భాష కు లిపిని సైతం ఆవిష్కరించడం విశేషం. గోండుల జీవన సౌందర్యాన్ని, వారి జీవితాల్లోని వెతలను, వా రి దీనత్వాన్నే ఇతివత్తంగా చేసుకుని ఆర్తిగా అనేక క వితలు, కథలు రాశాడు. వారి ఆక్రందనలకు, వ్యథా భరిత గాథలకు అక్షరరూపమిచ్చాడు. అప్పటి వరకు ఆదివాసీలను పట్టించుకున్న వారుకానీ, వారి యా సలో, భాషలో వారి జీవితాలపై సాహిత్య రచన చేసి న తెలుగు సాహితీవేత్తలు లేరంటే అతిశయోక్తి కాదేమో. గోండు బాలిక పేరునే కలం పేరు 'సాహు' గా పెట్టుకుని తుదిశ్వాస వరకు వెంకటేశ్వర్లు తన రచన ప్రక్రియను కొనసాగించారు. అందులో కన్నీటి కథ- నీటి కథ, పెండ్లికావాలి, ఖాయిదా (సంప్రదా యం) ఐదు రూపాయల కథ, భూమికోసం, జెండాక థ, ఆకలి, నిర్ణయం, కిసింగార్ వెంతా(అడవంటు కుంది), అమరుల రక్తం వథాకాదు, నాడె, రక్తపిం జెర, మరట్ తుడుం పాయానా( మనం తుడుం గొట్టాలె), మనుషుల్ని తినేవాళ్లకోసం, ఒక తల్లి, పిల్ల రక్కసులు, రగల్జెండా ముఖ్యమైనవి. 'ఐదు రూపా యల కథ ప్రముఖ రచయిత ప్రేమ్చంద్ రాసిన 'సవా శేర్ గోధుమలు కథతో సరిసమానమైనదని ఎందరో తెలుగు రచయితలు కితాబివ్వడం విశేషం. విహంగ వీక్షణం, ఇక్కడే, ఉదయమేది, వ్యాఘ్రాలు, ఎవరుకారకులు, విన్పం, జాగీరిగాళ్లు, విప్లవాల పాట, రన్నింగ్ కామెంటరీస్ వంటి ఎన్నో కవితలను రాశారు. ఇందులో 'ఎవరు కారకులు' అనే కవితలో నాటి భోపాల్ గ్యాస్ ఉదంతాన్ని వర్ణించిన తీరు గుం డెలను పిండేస్తుంది. పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి న తీరు అమోఘం.
''నాదేశపు దేహంపై
భోపాల్ ఒక మత్యుమడుగు
ఎన్ని అందమైన జీవితాలు
బహుళజాతి కలింగుని వాతపడ్డాయో
అని సాహు ఆవేదన చెందుతాడు. ఎవరు కార కులని ప్రశ్నిస్తాడు. బహుళజాతి సంస్థలను, వాళ్ల అడుగులకు మడుగులొత్తుతున్న నేతలను దునుమా డుతాడు. 'ఇక్కడే కవితలో ఇక్కడే ఆకలి ఉంది/శోకం ఉంది/ శిథిలమైన లోకం ఉంది/ వెలుగును మింగే చీకటి ఉంది' అని ఆదివాసీల జీవితాలను వర్ణిస్తాడు. అంతలోనే 'చేయి చేయి కలుపుదాం/ ఆకలి అంతు చూద్దాం' అంటూ వారికి దిశానిర్దేశం చేస్తాడు. విన్న పం కవితలో ఆదివాసీ స్త్రీలపై ఉన్న పురుషాధిక్యాన్ని నిలదీస్తాడు. ఇలా గోండులకు సంబంధించిన అనేక అంశాలపై సాహు కవితలు రాశాడు. సాహు అశువుగా అల్లిన పాటలు నేటికీ ప్రజానాల్కలపై దొర్లు తుండడం విశేషం. పొదల పొదల గట్ల నడుమ పొడిచెనొక్క సందమామ, శ్రామికధ్వజం, ప్రతిమలు, వెంకటరమణ వీర దండాలు, లోకానికి రారాజు, గోగుల తండా వీరుడు, ఎర్రగోగులెవ్వరో, ఖుర్బానీ, సందేశం, కరువుపాట వంటివి ఎంతో ప్రజాదరణ పొందాయి. అన్నింటికీ మించి బాలకార్మికుల వ్యథా భరిత గాథను ఇతివత్తంగా చేసుకుని అల్లిన
''నీ కన్నీరు నా కన్నీరు కలిగినోడికి పన్నీరాయె
ఒంటిగా శోకం బెట్టే చిన్ని తమ్మయ్యా
నీ జంటగా నేనుంటరారా చిన్నితమ్మయ్యా
నీళ్ల పంపే తల్లయి సాకేనా చిన్నితమ్మయ్యా'
అనే పాట సాహుకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది.
పశ్చిమబెంగాల్కు చెందిన రచయిత్రి మహాశ్వేతాదేవి కోవలోనే సాహు సైతం గిరిజనుల, ఆదివాసీల జీవితాలను ఆధారంగా చేసుకునే తన రచనలను కొనసాగించారు. గిరిజన పోరాట యో ధుడు బిర్సాముండా చరిత్రను ఆమె వెలికి తీసినట్టు గానే కొమురంభీమ్ చరిత్రను మౌఖిక సాహిత్యం నుంచి సాహు వెలికితీయడం గమనార్హం. సహ రచయిత అల్లం రాజయ్యతో కలిసి నిజాం కాలం నాటి దస్తావేజులను శోధించారు. భీం సమకాలీను లను, నాటి పోరాట యోధులను ఎంతో శ్రమకోర్చి వెతికి పట్టుకుని వివరాలను సేకరించి అన్ని అం శాలను బేరిజు వేసుకుని ఒక రూపానికి తీసుకొచ్చి ఆ నవలను ప్రపంచానికి అందించడంలో సాహు కీ లక భూమిక పోషించారు. ఇది తెలుగు నాట వెలు వడిన మొట్టమొదటి చారిత్రక నవలని పలువురు లబ్ధప్రతిష్టులైన సాహితీవేత్తలు కీర్తించడం విశేషం. అది 1983లో ఇంద్రవెల్లి స్తూపంతో పాటే అదే వేది కమీదనే కొమురంభీమ్ నవల ఆవిష్కతమవడం మరో విశేషం.
విప్లవోద్యమం చీలిన సందర్భంలో మహారాష్ట్ర లో పోలీసులు సాహును అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలై వచ్చిన అనంతరం తిరిగి పార్టీలోకి వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. అనంతర కాలంలో నేటి బీసీ కార్పొరేషన్ చైర్మన్ బీఎస్ రాము లు ఆధ్వర్యంలో నాడు ఏర్పడిన దళిత రచయిత కళాకారుల మేధావుల ఐక్య వేదిక(దరకమే)లో ఆయ న చేరి జిల్లా కన్వీనర్గా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. ఈ క్రమంలో తిరిగి తన సాహిత్యానికి పదును పెట్టాలనుకున్నాడు. మన్యం అడవుల్లో కిడ్నా పైన బాలరాజును ఇతివత్తంగా చేసుకుని నవల రా యాలని తలిచాడు. అంతలోనే మార్చి 16, 1993 లో అకాల మరణం పొందడం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు.
తెలుగు సాహిత్య రంగానికి ఇంతటి విశేష కషి చేసినా ప్రభుత్వాలు నాటి నుంచి నేటి వరకూ వివక్ష చూపుతూ ఆయన చేసిన సేవలను విస్మరిస్తున్నా యి. వెలుగుచూడకుండా కావాలనే తొక్కిపెడుతు న్నాయి. ఇప్పటికీ ఆయన స్వగ్రామమైన మాణిక్యా పూర్లో ఆవిష్కతమవకుండా మూలనపడి, దుమ్ము కొట్టుకుపోతున్న సాహు విగ్రహామే అందుకు నిద ర్శనం. ఈ మాత్రం సాహిత్యమైనా వెలుగులోకి వ చ్చిందంటే సాహు మిత్రుల కషియే కారణం. ఇకనైనా ప్రభుత్వం ఈ వివక్షను వీడాలి. ఇంకా వెలుగుచూడని, సాహు డైరీకే పరిమితమైన ఒగ్గుకథ, కవితలు ఇతర రచనలను వెలుగులోకి తీసుకురావాలి. ఆయన విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. దర్జీ వత్తితోనే కాలం వెళ్లదీస్తున్న ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే సాహుకు ఇచ్చే నివాళి.
- ఆర్కే ప్రావ్ద
సెల్ : 79815 74841